మీడియాకు వార్నింగ్ ఇచ్చిన డీకే బ్రదర్: పరువునష్టం కేసులు పెట్టి, ఏం అనుకుంటున్నారు ?
కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ కు విరుద్దంగా వార్తలు ప్రసారం చేసినా, దినపత్రికల్లో కథనాలు ప్రచురించినా అలాంటి మీడియా మీద పరువునష్టం దావా వేసి కోర్టుకు ఈడ్చుతామని ఆయన సోదరుడు డీకే.
బెంగళూరు: కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ కు విరుద్దంగా వార్తలు ప్రసారం చేసినా, దినపత్రికల్లో కథనాలు ప్రచురించినా అలాంటి మీడియా మీద పరువునష్టం దావా వేసి కోర్టుకు ఈడ్చుతామని ఆయన సోదరుడు డీకే. సురేష్ శుక్రవారం వార్నింగ్ ఇచ్చారు.
బెంగళూరు గ్రామీణ జిల్లా లోక్ సభ నియోజకవ వర్గం ఎంపీ (కాంగ్రెస్) డీకే. సురేష్ శుక్రవారం బెంగళూరులోని సదాశివనగర్ లోని తన సోదరుడు, మంత్రి డీకే. శివకుమార్ ను కలుసుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఆదాయపన్ను శాఖ అధికారులు అందుకు అవకాశం ఇవ్వలేదు.

ఈ సందర్బంగా డీకే. శివకుమార్ ఇంటి బయట ఎంపీ డికే. సురేష్ మీడియాతో మాట్లాడారు. మాకు పార్టీ కార్యకర్తల అండ ఉందని, బీజేపీ నాయకులు ఎాన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మమల్ని ఏమీ చెయ్యలేరని బీజేపీ పార్టీ నాయకుల మీద మండిపడ్డారు. రాజకీయ కక్షతోనే ఆదాయపన్ను శాఖతో దాడులు చేయించారని ఆరోపించారు.
ఆదాయపన్ను శాఖ దాడులు మొదలు పెట్టిన తరువాత డీకే. శివకుమార్ పరువు, ప్రతిష్ట దెబ్బ తియ్యడానికి కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నాయని, అలాంటి వారి మీద పరువునష్టం దావా వేస్తామని డీకే. సురేష్ హెచ్చరించారు. ఇప్పటి వరకూ ఆదాయపన్ను శాఖ అధికారులు ఎలాంటి వివరాలు బయటకు చెప్పకున్నా మీడియా మాత్రం ఇష్టం వచ్చినట్లు వార్తలు ప్రసారం చేస్తున్నాయని, అలాంటి వారిని విడిచిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications