భార్యకు కేజ్రీవాల్ ఆలింగనం: థ్యాంక్యూ సునీత అంటూ ట్వీట్
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ప్రజల బ్రహ్మరథం పట్టడంతో ఆమ్ ఆద్మీ పార్టీ చీప్ అరవింద్ కేజ్రీవాల్ ఉబ్బితబ్బైనట్లే కనిపిస్తున్నారు. ఎప్పుడూ రాని కేజ్రీవాల్ సతీమణి సునీత మంగళవారంనాడు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి వచ్చారు. గత 20 ఏళ్లుగా తనతో కాపురం చేస్తున్న భార్య సునీతను కేజ్రీవాల్ కౌగలించుకున్నారు.
విజయోత్సవాలకు సంబంధించిన ఫొటోలను ఆయన ట్విట్టర్లో పెట్టాడు. అప్పటికే ఆయన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. పశ్చిమ ఢిల్లీలోని పటేల్ నగర్లో గల మూడంతస్థుల భవనం బాల్కనీ నుంచి దర్శనమిస్తూ ఆయన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. ఆయన పక్కన భార్య సునీత కూడా ఉన్నారు. ఆరెంజ్ సల్వార్ కమీజ్ ధరించి ఆమె భర్త పక్కన నించున్నారు.
గులాబీ రేకులు పైనుంచి కురుస్తుండగా, కేజ్రీవాల్ - ఢిల్లీ ప్రజలకు సెల్యూట్, వారు అద్భుతాన్ని సాధించారు అని అన్నారు. అదే సమయంలో సునీత వీ సంకేతంతో విక్టరీ సంకేతం ఇచ్చారు. ఈమె నా భార్య అంటూ ఆమె భుజాలపై తన చేతులను ఉంచుతూ కేజ్రీవాల్ సునీతను ప్రజలకు పరిచయం చేశారు. సునీత చేతులు జోడించి నవ్వుతూ కనిపించారు.
ఆమెను తాను ఈరోజు ఇక్కడికి లాక్కొచ్చానని, ప్రభుత్వం ఏ విధమైన చర్య కూడా తీసుకోదని ఆయన అన్నారు. ఆమె లేకుండా తాను ఏదీ సాధించలేకపోయేవాడినని కేజ్రీవాల్ సునీతకు కితాబు ఇచ్చారు. ఒంటరిగా తానేమీ చేయలేనని, తాను చాలా చిన్నవాడినని ఆయన అన్నారు.
Thank
u
Sunita
for
always
being
there
"@rsaraf007:
Sunita
Kejriwal
and
@ArvindKejriwal
first
pics
after
winning
pic.twitter.com/eDLxfxKMbd"
—
Arvind
Kejriwal
(@ArvindKejriwal)
February
10,
2015