2జీ స్కామ్ కలకలం, సీఎం సోదరికి షాక్, సీబీఐ పిటిషన్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, లోక్ సభ ఎన్నికల్లో ?

2జీ స్కామ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి ఎ. రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి తదితరుల విడుదలపై సీబీఐ దాఖలు చేసిన అప్పీళ్లను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం విచారణకు అనుమతించింది. లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు అయిన తరువాత ఏళ్ల క్రితం నాటి 2 జీ స్కామ్ కేసు మరోసారి తెరమీదకు రావడంతో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైయ్యింది.

ఈ 2G స్పెక్ట్రమ్ దుర్వినియోగం కేసు చాలా ముఖ్యమైనది కావడంతో ఇప్పుడు డీఎంకేకు పెద్ద ఇబ్బందిని తెచ్చిపెట్టింది. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీకి 2 జీ స్కామ్ కేసు అప్రతిష్టను తెచ్చిపెట్టింది. 2 జీ స్కామ్ కేసులో డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం ఎం. కరుణానిధి కుమార్తె కనిమొళి తీహార్ జైలుకు వెళ్లారు. గతంలో 2జీ స్కామ్ కేసు డీఎంకే పార్టీకి కష్టాలను తెచ్చిపెట్టింది.

Delhi High Court hears petitions filed by CBI against DMK MP Kanimozhi and A Raja in 2G Skoom case

కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ప్రభుత్వం ఏర్పడినప్పుడు డీఎంకే నాయకుడు ఎ. రాజా కేంద్ర టెలికమ్యూనికేషన్ మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి. అంటే పబ్లిక్ బిడ్డింగ్‌కు బదులుగా ముందుగా వచ్చిన వారికి లభ్ది చేకూరే విధానాన్ని అనుసరించారని ఆరోపణలు ఉన్నాయి

లక్షల కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగిందని అప్పట్లో సెంట్రల్ ఆడిట్ కమిటీ ఆరోపించింది. దీని ఆధారంగా ఎ.రాజా, కనిమొళి సహా మొత్తం 17 మందిని అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపించారు. అనంతరం అందరూ బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా నిర్ధారించి 2018లో విడుదల చేశారు. ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పును సవాలు చేస్తూ సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు.

ఈ అప్పీలుపై విచారణ పూర్తయింది. ఈ పరిస్థితిలో సీబీఐ దాఖలు చేసిన అప్పీలును స్వీకరించాలా వద్దా అనేది ఢిల్లీ హైకోర్టు నిర్ణయించవచ్చు. ఈ సమయంలో 2జీ స్కామ్ కేసుకు సంబంధించి సీబీఐ అప్పీళ్లను స్వీకరిస్తామని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఈ అప్పీళ్లపై మే నుంచి విచారణ చేపడతామని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. లోక్ సభ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైన సమయంలో మరోసారి 2జీ స్కామ్ కేసు తెర మీదకు రావడంతో తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంతో పాటు ఇండియా కూటమిలోని పార్టీలకు ఇబ్బంది ఎదురైయ్యిందని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+