ప్రధాని మోడీ డిగ్రీపై తేల్చేసిన ఢిల్లీ హైకోర్టు..! కీలక ఉత్తర్వు..!
ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలపై కొనసాగుతున్న వివాదంలో ఇవాళ మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గతంలో 2016లో కేంద్ర సమాచార కమిషన్ ఢిల్లీ యూనివర్శిటీని ప్రధాని మోడీ చదివిన డిగ్రీని బయటపెట్టాలని ఉత్తర్వులు ఇచ్చింది. ప్రధాని మోడీ చదివిన డిగ్రీ వివరాలు కోరుతూ దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా సీఐసీ ఈ ఆదేశాలు ఇచ్చారు. అయితే వీటి అమలు విషయంలో ఇవాళ ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
2016లో కేంద్ర సమాచార కమిషన్ 1978లో బీఏ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరి రికార్డులను తనిఖీ చేయడానికి అనుమతించింది. ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పరీక్షలో ఉత్తీర్ణులైనట్లు తెలుస్తోంది. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ విశ్వవిద్యాలయం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. 2017 జనవరిలో జరిగిన మొదటి విచారణ రోజు సీఐసీ ఆదేశాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. అప్పటి నుంచీ ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.

ప్రధాని మోడీ చదివిన డిగ్రీ వివరాలను బయటపెట్టాలని సీఐసీ ఇచ్చిన ఆదేశాలపై ఇవాళ మరోసారి విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. యూనివర్శిటీ ఈ వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పేసింది. తెలుసుకునే హక్కు కంటే గోప్యత హక్కు పెద్దదని, అందుకే సీఐసీ గతంలో ఇచ్చిన ఉత్తర్వులు కొట్టేయాలని వర్శిటీ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు.

ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థుల సమాచారాన్ని విశ్వసనీయ సామర్థ్యంలో ఉంచుతుందని , విస్తృత ప్రజా ప్రయోజనం లేనప్పుడు కేవలం ఉత్సుకత మేరకు సమాచార హక్కు చట్టం కింద ప్రైవేట్ వివరాలను కోరడం సమర్ధనీయం కాదని వాదించింది. సెక్షన్ 6 సమాచారం ఇవ్వవలసి ఉంటుందని ఆదేశాన్ని ఇస్తుందని, అయితే దాని ఉద్దేశ్యం సమాచార హక్కు చట్టం ఎవరి ఉత్సుకతను తీర్చడం కోసం కాదని యూనివర్శిటీ వాదించింది.












Click it and Unblock the Notifications