మోడీ తల్లికీ తప్పలేదు: క్యూలో నిల్చుని నోట్లు మార్చుకున్న హీరాబెన్
గాంధీనగర్: దేశంలోని నల్లధనం, నకిలీ కరెన్సీని పూర్తిగా అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గత మంగళవారం రాత్రి రూ. 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మోడీ ప్రకటన వెలువడిన మరుసటి రోజు నుంచి సామాన్యులకు ఇబ్బందులు మొదలయ్యాయి.
అత్యవసరమైన విభాగాల్లో ఆ నోట్లను చెల్లుబాటయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కింది స్థాయిలో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇది ఇలా ఉంటే.. ప్రధాని మోడీ నిర్ణయం ఆయన తల్లి హీరా బెన్ కూడా బ్యాంకు వద్ద వరుసలో నిలబడేలా చేసింది.
మంగళవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ కూడా తన వద్దనున్న పాత నోట్లను మార్చుకునేందుకు సామాన్యురాలిగా బ్యాంకుకు వచ్చారు. మంగళవారం గుజరాత్లోని గాంధీనగర్లో గల ఓ బ్యాంకుకు చేరుకున్న ఆమె... పాత పెద్దనోట్లను మార్చుకుని కొత్తనోట్లను తీసుకున్నారు. ఆమె వెంట కుటుంబసభ్యులు ఉన్నారు.
Gujarat: PM Narendra Modi's mother Heeraben Modi at a bank in Gandhinagar to exchange currency of Rs 4500 #DeMonetisation pic.twitter.com/Omqh51Gv7D
— ANI (@ANI_news) 15 November 2016
Gujarat: PM Narendra Modi's mother Heeraben Modi avails new currency notes at a bank in Gandhinagar #DeMonetisation pic.twitter.com/vAhXhY0Iu6
— ANI (@ANI_news) 15 November 2016