చెన్నైకి ముప్పు?: బంగాళాఖాతంలో వాయుగుండం
చెన్నై: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దీంతో దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు, పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తమిళనాడు రాజధాని చెన్నైకి నైరుతి దిశగా 240 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది.
నైరుతీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. మరో 48 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తమిళనాడు, కేరళలో సోమవారం నుంచే ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి.

ముఖ్యంగా తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదు. అయితే వాతావరణ శాఖ మందస్తు హెచ్చరికలతో చెన్నైలోని అధికారులు అప్రమత్తమయ్యారు. మృత్యకారులు వేటకు వెళ్లవద్దంటూ డీసీ-1 హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది.
మరోవైపు వాయుగుండం కారణంగా తమిళనాడుతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications