హీరా గోల్డ్ 'మాయా' ప్రపంచం.. 1.76 లక్షల ఖాతాదారులకు కుచ్చుటోపీ.. రికవరీ కష్టమే!?
హీరా కుంభకోణంపై ఈడీ తన దార్యాప్తును ముమ్మరం చేసింది. సుమారు మూడు వేల కోట్ల రుపాయాల కుంభకోణానికి పాల్పడి జ్యూడిషియల్ రిమాండ్ లోఉన్న హీరా గ్రూప్ సీఈవో నౌహిరా షేక్ తోపాటు ఆసంస్థ ప్రతినిధులైన బీజుథామస్, మోజు థామస్లను నాంపల్లి కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుంది.కాగా ఆ ముగ్గురు నిందితులను ఈడీ వారం రోజుల పాటు విచారించనుంది.
హీరా గ్రూపుల్లో పెట్టుబడి పెట్టినవారిలో బినామీలు ఉన్నారని,మనీలాండరింగ్ లో భాగంగానే వారు పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ ఆ వివరాలను రాబట్టే ప్రయత్నం చేయనుంది.కాగా మొత్తం దేశవ్యాప్తంగా లక్ష 72వేల 114 మంది డిపాజిటర్ల నుండి మూడు వేల కోట్ల వరకు వసూలు చేసినట్టు ఈడీ విచారణలో తేలినట్టు వారు తెలిపారు.కాగా దేశవ్యాప్తంగా సంస్థకు చెందిన మరికొందరిపై కూడ ఈస్కాం కేసులు కూడ నమోదయ్యాయి.
పెట్టుబడిదారులను మోసం చేసేందుకు హీరా గ్రూప్ తెరతీసిందని, తిరిగి చెల్లింపులకోసం సంస్థ ఆలోచించలేదని ఈనేపథ్యంలోనే డిపాడిట్లను బినామీ పేర్లమీదకు మళ్లించారని ఈడీ తెలిపింది. ఈనేపథ్యంలోనే నిధుల మళ్లింపుతో ఇతర ఆస్థులు కొనుగోలు చేశారని వాటితో సుమారు 24 సంస్థలు ఏర్పాటు చేసీ వేర్వేరు బ్యాంకుల్లో 182 ఖాతాలు తెరిచారు.దీంతోపాటు విదేశాల్లో కూడ మరో అకౌంట్స్ ఓపెన్ చేశారు.