సెల్యూట్ రాణా! బూస్టర్ డోసు వారికి ఉచితంగా ‘ఛోలే భతూరే’, మోడీ ప్రశంస
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉచిత బూస్టర్ డోసును అందిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి రెండు డోసులు తీసుకున్నవారంతా బూస్టర్ డోసు తీసుకోవాలని ప్రజలను కోరింది. ఈ నేపథ్యంలో పలు అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టింది. తాజాగా, బూస్టర్ డోసు వేసుకునేందుకు తనవంతుగా ప్రోత్సాహం అందించిన ఓ చిరు వ్యాపారికి ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలియజేశారు.

అప్పుడు ప్రధాని మోడీ ప్రశంసలుకున్నారు
గత ఏడాది పీఎం నరేంద్ర మోడీ ప్రశంసలు అందుకున్న చండీగఢ్ చిరు వ్యాపారి సంజయ్ రాణా.. మూడవసారి కోవిడ్-19 వ్యాక్సిన్ డోస్ తీసుకునే వారికి ఉచితంగా 'ఛోలే భాతురే' అందిస్తున్నారు. 45 ఏళ్ల విక్రేత మాట్లాడుతూ.. మూడవ డోస్ తీసుకోవడానికి అర్హత ఉన్న చాలా మంది వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదని తెలిపారు. ప్రజలు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆ కార్డును చూపిస్తే ఉచితంగా ఛోలే భాతురే అందించారు ఈ చిరు వ్యాపారి. ఈ విషయాన్ని గుర్తించిన ప్రధాని మోడీ ఆయనను అభినందించారు.

బూస్టర్ డోసు తీసుకున్నవారికి ఉచితంగా ఛోలే భాతురే
అదే రోజున ప్రజలు తమ వ్యాక్సిన్ కార్డ్లను చూపించిన తర్వాత విక్రేత గత సంవత్సరం 'ఛోలే భాతురే' అందించారు. వ్యాక్సిన్ షాట్లను తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ప్రధాని మోడీ "మన్ కీ బాత్" రేడియో ప్రసారంలో ప్రశంసలు అందుకున్నాయి. ఇప్పుడు కూడా ఆయన బూస్టర్ డోసు తీసుకున్నవారికి ఉచితంగానే ఛోలే భాతురే అందిస్తున్నారు.

బూస్టర్ డోసును ప్రోత్సహించాలనే ఈ ఉచిత ఛోలే భాతురే
చిరు వ్యాపారి రాణా ఫుడ్ స్టాల్ నడుపుతూ సైకిల్పై 'ఛోలే భాతురే' విక్రయిస్తున్నాడు. అతను గత 15 సంవత్సరాలుగా ఈ స్టాల్ను నడుపుతున్నానని, అతని కుమార్తె రిద్ధిమా, మేనకోడలు రియా తన స్టాల్ నుంచి ఉచితంగా 'ఛోలే భాతురే'ని ఇవ్వాలనే ఆలోచనను ఇచ్చారని చెప్పారు. తన మూడవ డోస్ తీసుకున్న రాణా.. బూస్టర్ డోసు కోసం ప్రజలు నెమ్మదిగా రావడంపై ఆందోళన వ్యక్తం చేశాడు. బూస్టర్ డోసు తీసుకునేవారిని ప్రోత్సమించాలని ఉద్దేశంతోనే తాను ఇలా చేస్తున్నట్లు తెలిపారు. "అదే రోజు ముందు జాగ్రత్త మోతాదుకు సంబంధించిన రుజువును చూపించే వారికి నేను చోలే భాతురేను ఉచితంగా ఇస్తున్నాను" రాణా చెప్పాడు.

బూస్టర్ డోసు అందరూ వేసుకోవాలంటూ రాణా
"అర్హులందరూ ముందుకు రావాలి, వెనుకాడొద్దు. ఇప్పటికే, దేశంలోని అనేక ప్రాంతాల్లో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయని మనం చూస్తున్నాము. పరిస్థితి చేయి దాటిపోయే వరకు మనం ఎందుకు వేచి ఉండాలి? ఏప్రిల్-మే 2021లో ఉన్న పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి" అని రాణా పీటీఐకి వెల్లడించాడు.

దేశం కోసం తనవంతుగా చేస్తానంటున్న రాణా
"చిన్నప్పుడు, నాకు దేశానికి సేవ చేయాలని, సాయుధ దళాలలో చేరాలని చాలా కోరిక ఉండేది. కానీ విధి నా కోసం వేరేది ఉంచింది. కానీ ఇప్పుడు నేను నా వంతుగా వేరే విధంగా చేయాలనుకుంటున్నాను, ఇది నాకు గొప్ప సంతృప్తిని ఇస్తుంది" అని రాణా తెలిపాడు. హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్కు చెందిన రాణా తన భార్య గృహిణి అని, తమకు ఒక కుమార్తె ఉందని చెప్పారు. ప్రధానమంత్రి తన మన్ కీ బాత్లో నా పేరును ప్రస్తావించడం నాకు గొప్ప గౌరవం అని రాణా అన్నారు.
తాను 10వ తరగతి వరకు చదివానని, తన తండ్రి చనిపోవడంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు, ఇద్దరు అన్నదమ్ములను పోషించుకోవాల్సిన కారణంగా కుటుంబ బాధ్యతలు తన భుజాలపై పడ్డాయని రాణా చెప్పాడు."చాలా సంవత్సరాల క్రితం, నేను కూడా ఇక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేశాను" అని చెప్పిన రాణా.. తన కుమార్తెకు మంచి చదువు చెప్పాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications