రూ.100 కోట్ల మోసం.. విద్యార్థులే ఇలా.. ఏం చెప్పి, ఏం చేశారంటే..
ఉపాధి పేరుతో మోసాలు ఎన్నో.. కొలువు అంటే నమ్మేస్తారు. ఆ నమ్మకమే కొందరికీ పెట్టుబడి అవుతుంది. అయితే ఇక్కడ యువత ఉద్యోగాల పేరుతో టోకరా వేసింది. వారంతా విద్యార్థులే కావడం విశేషం. రూ. 100 కోట్ల మేర మోసానికి పాల్పడ్డారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ టాలెంట్ను స్టడీపై కాకుండా.. ఇలాంటి క్రిమనల్ వర్క్స్ మీద పెట్టారు.
తమిళనాడుకు చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్ గ్యాంగ్ మాస్టర్ ప్లాన్ వేసింది. ఈజీగా మనీ సంపాదించాలనే పథకం వేశారు. ప్లాన్ను వెంటనే అమలు చేశారు. ముంబై కంపెనీ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆన్లైన్లో ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకటనను నమ్మిన నిరుద్యోగులు చాలా మంది కొంతమొత్తం డబ్బు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. కోట్లలో డబ్బులు వసూలైంది. ఆ చీటర్స్ ఉడాయించారు. ఫిర్యాదు అందుకున్న ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు.
కన్యాకుమారి జిల్లా నాగర్కోవిల్లో ఆన్లైన్ చీటింగ్ చేశారు. ప్రిన్స్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంగ్లో ఇతనే కీలక వ్యక్తిగా గుర్తించారు. కోట్లలో నగదు తీసుకుని చీటింగ్ చేశాడట. గ్యాంగ్లో మిగతావారు పరారీలో ఉన్నారని, వారికోసం గాలింపు ముమ్మరం చేశామని తెలిపారు. ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇంతటి మోసానికి పాల్పడటం చూసి అధికారులు అవాక్కయ్యారు.
ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఇలా ఛీట్ చేశారు. ఉద్యోగం అంటే వారంత నమ్మారు. ఫీజు కట్టమంటే అడిగినన్ని కట్టారు. కానీ ఇంతలోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వారంతా మోసపోయారు.