లాక్డౌన్ ఉన్నా.. మీడియాకు అంతరాయం కలిగిచొద్దు: రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం
న్యూఢిల్లీ: లాక్డౌన్ నేపథ్యంలో దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. కొవిడ్-19 విజృంభన నేపథ్యంలో ప్రసార మాధ్యమాల సేవలకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా చూసుకోవాల
న్యూఢిల్లీ: లాక్డౌన్ నేపథ్యంలో దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. కొవిడ్-19 విజృంభన నేపథ్యంలో ప్రసార మాధ్యమాల సేవలకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా చూసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శుల(సీఎస్)కు కేంద్రం స్పష్టం చేసింది.

రాష్ట్రాలకు, కేంద్రపాలితాలకు సూచనలు
ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా నిర్మూలనకు కేంద్రంతోపాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయని, అయితే అదే సమయంలో వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని కేంద్రం ఆ ప్రకటనలో అభిప్రాయపడింది.

మీడియా తన పాత్ర పోషించాలి..
టీవీ ఛానెళ్లు, న్యూస్ ఏజెన్సీలు, టెలీపోర్ట్ ఆపరేటర్లు, డీఎస్ఎన్జీలు, డీటీహెచ్లు, ఎంఎస్వోలు, కేబుల్ ఆపరేటర్లు, ఎఫ్ఎం రేడియోలు, కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో ప్రజలను అప్రమత్తం చేయాలని కేంద్ర సమాచార శాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతోపాటు కరోనా నిర్మూలన కోసం ప్రజలకు అవసరమైన ముఖ్య సందేశాలను ప్రసారం చేయాలని సూచించింది. అదే సమయంలో తప్పుడు వార్తలు, ప్రజలను భయాందోళనలకు గురిచేసే వార్తలకు దూరంగా ఉండాలని కోరింది. తప్పుడు కథనాలు ప్రసారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

హైదరాబాద్లో జర్నలిస్టులకు లాఠీ దెబ్బలు..
కాగా, హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో లాక్ డౌన్ సందర్భంగా రహదారులపైకి విధుల నిమిత్తం వచ్చిన కొందరు జర్నలిస్టులపై పోలీసులు లాఠీలతో కొట్టడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. తాము జర్నలిస్టులమని చెప్పినా వినకుండా పోలీసులు తమపై దాడి చేశారని బాధితులు ఆరోపింారు. దాడికి పాల్పడిన సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియాకు, జర్నలిస్టులకు అత్యవసర సేవల కింద మినహాయింపు ఉన్నప్పటికీ పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications