అతనికి ఇద్దరు భార్యలు: బాలికలపై లైంగిక దాడులు
నాగపూర్: బాలికలను దత్తత తీసుకొని లైంగిక దాడికి పాల్పడుతున్న మహారాష్ట్రలోని నీరికి చెందిన మాజీ శాస్త్రవేత్త మసూద్ అన్సారీ(72)ని ధన్తొలి పోలీసులు అరెస్టు చేశారు. తన స్నేహితురాలి కుటుంభసభ్యులతో పదహరేళ్ల బాలిక ఎన్జీవోను ఆశ్రయించింది. లైంగిక దాడికి గురైన బాలికను ఎన్జీవో సంస్థ చేరదీసి, పాఠశాలకు పంపిస్తోంది.
తనను ఒకటో తరగతి నుంచి అన్సారీ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆ మైనర్(16) బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మసూద్ అన్సర్ పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పాడని ఆ బాలిక తెలిపింది. 11 ఏళ్లు ఉన్న బాలిక, ఆరున్నర ఏళ్ల బాలికపై కూడా లైంగికదాడి చేశాడని ఆమె తెలిపింది.
బాలిక ఫిర్యాదుమేరకు ధన్తొలి పోలీసులు మసూద్ అన్సారీని అదుపులోకి తీసుకుని ఫోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. రెండు పెళ్లిళ్లు చేసుకున్న అన్సారీ తండ్రీ కాలేదు. ఈ నేపథ్యంలో బాలికలను చదివిస్తానని చెప్పి దత్తత తీసుకున్నాడని పోలీసు అధికారులు తెలిపారు.
అయితే అన్సారీతో అతని ఇద్దరు భార్యలు ఉండడం గమనార్హం. మసూద్ అన్సారీ బాలికలను దత్తత తీసుకున్నట్లు అతని ఇంట్లో ఎలాంటి ఆధారం లభించలేదని పోలీసులు పేర్కొన్నారు.