ఎగ్డిట్ పోల్: హిమాచల్లో కమల వికాసమేనని ఇండియా టుడే
సిమ్లా: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గుజరాత్ ఫలితాల తర్వాత హిమాచల్లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది.
ఇక్కడ 68 స్థానాలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. కాగా, హిమాచల్ ప్రదేశ్ బీజేపీతో అని పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి.
ఇండియా టుడే సర్వే ప్రకారం బిజెపి 47 నుంచి 55 స్థానాలు దక్కించుకుంటుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 35 సీట్లు సరిపోతాయి. దీంతో హిమాచల్ ప్రదేశ్లో బిజెపి దాదాపుగా కాంగ్రెసును తుడి పెట్టినట్లేనని చెప్పవచ్చు.
కాంగ్రెసుకు 13 నుంచి 20 సీట్ల వరకు మాత్రమే గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇతరులు 2 సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లు అనంచనా వేసింది.
ఎబిపి న్యూస్ సర్వే...
ఎబిపి న్యూస్ - సిఎస్డిఎస్ ప్రకారం హిమాచల్ ప్రదేశ్లో బిజెపి స్వీప్ చేస్తుంది. భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. బిజెపికి 47 నుంచి 55 సీట్ల వరకు వస్తాయని అంచనా వేసిది. కాంగ్రెసు 13 నుంచి 20 సీట్లు మాత్రమే గెలుచుకుంటుంది.ఇతరులకు అవకాశం లేదని అంచనా వేసింది.