Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఢిల్లీలో పేలుడు: ఇజ్రాయిల్ ఎంబసీ, గణతంత్ర ముగింపు వేడుకలకు సమీపంలోనే ఘటన

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయిల్ ఎంబసీ సమీపంలో పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ పేలుడు ప్రభావం ఏ రకమైనదనేది ఇంకా తెలియరాలేదు. ప్రాథమికంగా ఐఈడీ పేలుడుగా భావిస్తున్నారు.

టైమ్స్ నౌ కథనం ప్రకారం.. ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం సమీపంలోని ఫుట్‌పాత్ వద్ద ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి అక్కడ పార్కు చేయబడిన పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే, పేలుడు తీవ్రత తక్కువగా ఉండటంతో భారీ నష్టం జరగలేదు.

Explosion near Israeli embassy in Delhi; windscreen of several cars damaged

ఈ ఘటనలో ఎవరికీ గాయాలైనట్లు సమాచారం లేదు. ఢిల్లీలోని ఔరంగజేబ్ రోడ్‌లో ఉన్న ఇజ్రాయిల్ ఎంబసీ ఉంది. ఈ పేలుడుకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా, గణతంత్ర ముగింపు వేడుకలు జరుగుతున్న ప్రాంతానికి సమీపంలోనే ఈ పేలుడు సంభవించడం గమనార్హం. ఈ వేడుకల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ప్రధాని, కేంద్రమంత్రులు, తదితరులు పాల్గొనడం గమనార్హం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+