ఫేక్ న్యూస్: ఐదు విడతల్లో లాక్డౌన్ ఎగ్జిట్..? సోషల్ మీడియాలో వైరల్, ఫేక్ అన్న కేంద్రం
కరోనా వైరస్ వ్యాధి సమూల నిర్మూలన కోసం విధించిన లాక్డౌన్ ఎగ్జిట్ చేసేందుకు ఐదు విడతల్లో ఆంక్షలను సడలిస్తున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ అది నిజం కాదని కేంద్ర ప్రభుత్వం వర్గాలు స్పష్టంచేశాయి. అది భారతదేశం యొక్క విధానం కాదు అని తేల్చిచెప్పాయి.
కరోనా వైరస్ నిబంధనలను ఐదు విడతల్లో తగ్గిస్తూ వస్తోందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. మొదటి విడతలో భాగంగా మే 18వ తేదీ వరకు మూడువారాలు పరిస్థితిని అంచనా వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మే 18వ తేదీ తర్వాత జూన్ 8వ తేదీన రెండో విడత అని.. జూన్ 29వ తేదీ మూడో విడత, జూలై 20వ తేదీ నాలుగో విడత అని ప్రచారం జరుగుతోంది. చివరగా ఐదో విడత ఆగస్ట్ 10వ తేదీన ఉంటుందని.. ఆ సమయానికి నింబంధనలు మొత్తం తీసివేస్తారని పేర్కొంటున్నారు. అయితే ఇది కరోనా వైరస్ తగ్గితే.. మరీ వైరస్ పెరిగితే పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తుందని కూడా సోషల్ మీడియాలో వార్త ట్రోల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోన్నవార్త అబద్దం అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేశాయి. తమ వద్ద అలాంటి విధానం ఏమీ లేదని తేల్చిచెప్పింది. నిబంధనల సడలింపు అంశం భారతదేశానిది కాదు అని.. ఇతర దేశాలు ఏమైనా అవలంభిస్తున్నాయి కావొచ్చని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం క్లారిటీతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న న్యూస్ ఫేక్ అని స్పష్టమైంది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications