Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భగవంతుడా.. కూతురు శవంతోనే ఐదు నెలలు పాటు తండ్రి.. ఏం చేశాడంటే ??

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ లో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. 76 ఏళ్ల రిటైర్డ్ క్లర్క్ ఉదయ్ భాను బిస్వాస్ తన కూతురు.. ప్రియాంక బిస్వాస్ మృతదేహాన్ని ఐదు నెలల పాటు ఇంట్లోనే దాచిపెట్టడం స్థానికంగా సంచలనంగా మారింది. తేలీ మొహల్లా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన తీవ్రమైన చర్చలకు దారితీసింది.

ప్రియాంక బిస్వాస్ మరణించిన తర్వాత ఆమెకు అంత్యక్రియలు నిర్వహించకుండా, మృతదేహాన్ని గదిలోనే ఉంచినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. మృతదేహం నుంచి దుర్వాసన రాకుండా ఉండేందుకు ఉదయ్ భాను పెద్దఎత్తున పర్ఫ్యూమ్‌లు ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. గది అంతా సుగంధ ద్రవ్యాలతో నింపి, కూతురు ఇంకా నిద్రలో ఉన్నట్లుగా కప్పి ఉంచడం ఈ ఘటనను మరింత భయానకంగా మార్చింది. అక్కడి నుంచి పదుల సంఖ్యలో ఖాళీ పర్ఫ్యూమ్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

father-sleep-with-her-daughter-dead-body-from-past-five-months-at-meerut-in-uttar-pradesh

ప్రియాంక చదువులో ప్రతిభావంతురాలు అని.. డబుల్ ఎంఏ, ఎంటెక్ పూర్తి చేసి కంప్యూటర్ టీచర్‌గా పనిచేసిందని చెబుతున్నారు. అయితే తల్లి మరణం తర్వాత గత 13 ఏళ్లుగా ఆమె తీవ్ర మానసిక కుంగుబాటుతో బాధపడుతూ వచ్చిందంటున్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె డిసెంబర్ 5న మరణించినట్లు తండ్రి విచారణలో అంగీకరించాడు. అయితే కూతురిపై ఉన్న అపారమైన ప్రేమ, ఆమెను కోల్పోయిన బాధతో మృతదేహాన్ని వదలలేక ఈ నిర్ణయం తీసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ప్రియాంక చాలా కాలంగా కనిపించకపోవడంతో అనుమానం వ్యక్తం చేసిన బంధువులు ఆమె గురించి ఆరా తీయడం ప్రారంభించారు. మొదట దేహ్రాదూన్‌లో చికిత్స పొందుతోందని ఉదయ్ భాను అబద్ధం చెప్పినా, బంధువుల ఒత్తిడికి తట్టుకోలేక ఏప్రిల్ 10న అసలు విషయాన్ని వెల్లడించాడు. వారు ఇంట్లోకి వెళ్లి చూడగా, మంచంపై ఉన్న ప్రియాంక శరీరం పూర్తిగా ఎముకల గూడుగా మారిపోయి ఉండటం వారిని షాక్‌కు గురి చేసింది.

ఈ ఘటనపై స్పందించిన సివిల్ లైన్స్ సీఓ నవీనా శుక్లా, మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉందని తెలిపారు. ఈ కేసులో మరిన్ని అనుమానాస్పద కోణాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ప్రియాంక అనారోగ్యానికి వైద్య చికిత్సకు బదులుగా ఒక మతాచార్యుడి వద్దకు తీసుకెళ్లినట్లు సమాచారం. మూఢనమ్మకాలు, మానసిక ఆరోగ్యంపై అవగాహన లోపం, లేదా తండ్రి-కూతురు మధ్య ఉన్న భావోద్వేగ బంధం-ఈ ఘటనకు కారణమో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.

మరోవైపు ఈ సంఘటన సమాజానికి ఒక గంభీర హెచ్చరికగా మారింది. మానసిక ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడం, మూఢనమ్మకాలపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన చూపిస్తోంది. అలాగే, కుటుంబ సభ్యులపై ప్రేమ పేరుతో తీసుకునే కొన్ని నిర్ణయాలు ఎంత దూరం వెళ్తాయో కూడా ఇది స్పష్టం చేసింది. నిపుణులు ఇలాంటి పరిస్థితుల్లో సమయానికి వైద్య సహాయం, కౌన్సెలింగ్ తీసుకోవడం ఎంతో అవసరమని సూచిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+