వైద్యురాలిపై లైంగిక వేధింపులు: కాశ్మీర్ మంత్రిపై కేసు
బాధితురాలైన మహిళా వైద్యురాలి ఫిర్యాదు ప్రకారం.. జనవరి 28న తాను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి షబ్బీర్ అహ్మద్ ఖాన్ను కలిసేందుకు రాష్ట్ర సచివాలయానికి వెళ్లానని చెప్పారు. ఆయనతో మాట్లాడుతుండగా ఆయన తనకు టీ తెప్పించారని తెలిపారు. ఆ టీ తాగిన తర్వాత తనకు మత్తు ఆవరించిందని ఆమె చెప్పారు. ఆ క్రమంలోనే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారు.
ఇది ఇలా ఉండగా బాధితురాలి ఆరోపణలపై స్పందించేందుకు మంత్రి అహ్మద్ ఖాన్ నిరాకరించారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో కొనసాగుతున్న సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అహ్మద్ ఖాన్ ఆరోగ్యశాఖ మంత్రి పదవిలో ఉన్నారు. కాగా బాధితురాలు గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని, కోర్టు ఆదేశంతోనే కేసు నమోదు చేశారని స్థానికులు చెబుతున్నారు.
క్రిమినల్ పీనల్ కోడ్ 509 సెక్షన్ కింద నేరం రోజువైతే నిందితునికి కనీసం ఒక సంవత్సరం జైలు శిక్ష విధించబడుతుంది. అలాగే 354 సెక్షన్ కింద నేరం రుజువైతే రెండేళ్లపాటు నిందితునికి జైలు శిక్ష విధించడం జరుగుతుంది. కాగా నిందితుడైన మంత్రి షబ్బీర్ అహ్మద్ ఖాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని విపక్షాల నాయకులు డిమాండ్ చేశారు.