Lockdown: కరోనా ఎఫెక్ట్, భారత్ లో విదేశీయులకు మైండ్ బ్లాక్, ఒక్కసారి కాదు 500 సార్లు, అంతే !
రిషికేశ్/ హరిద్వార్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేశారు. దేశంలో లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించిన వారి మీద పోలీసులు వివిద సెక్షన్ ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో అనవసరంగా రోడ్ల మీద బైక్ ల్లో తిరుగుతున్న వారి వాహనాలు సీజ్ చేశారు. అయితే లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి రోడ్ల మీదకు వస్తున్న విదేశీయులకు ఉత్తరాఖండ్ పోలీసులు తమదైన శైలిలో బుద్ది చెబుతున్నారు. పాము చావకుండా కట్టి వరగకుండా పని జరిగిపోవాలి అనే సామెతను పోలీసులు గుర్తు చేశారు. శ్వేత పత్రం తీసుకు వచ్చి వారి దగ్గర 500 సార్లు మమ్మల్ని క్షమించండి, భారతదేశ నియమాలు ఉల్లంఘించాం, జీవితంలో ఇలాంటి తప్పులు మరోసారి చెయ్యం అంటూ వారి చేత రాయిస్తూ సరికొత్త రీతిలో శిక్షించడంతో వారి మైండ్ బ్లాక్ అయ్యింది.

భారత్ లో లాక్ డౌన్ దెబ్బ
కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ కారణంగా దేశం మొత్తం అన్ని జాతీయ రహదారుల్లో సుమారు 3. 5 లక్షలకు పైగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో అనవసరంగా రోడ్ల మీద సంచరిస్తున్న ప్రజలకు బుద్ది చెప్పడానికి వారి వాహనాలను అధికారులు సీజ్ చేశారు. కరోనా లాక్ డౌన్ దెబ్బకు ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు.

విదేశీ పర్యాటకులు, భక్తులు
కరోనా వైరస్ దెబ్బకు భారత్ లో లాక్ డౌన్ అమలు చెయ్యకముందే భారతదేశంలోకి విదేశీ పర్యటకులు చాలా మంది వచ్చారు. లాక్ డౌన్ కు ముందు కొందరు విదేశీయులు వారి దేశాలకు వెళ్లి పోయారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేశ్, హరిద్వార్, బద్రీనాథ్ తదితర ప్రాంతాల్లో కొందరు విదేశీ పర్యటకులు, భక్తులు పర్యటిస్తున్నారు. కరోనా దెబ్బకు భారత్ మొత్తం లాక్ డౌన్ అయినా విదేశీ పర్యటకులు మాత్రం రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు.

విసిగిపోయిన పోలీసులు
లాక్ డౌన్ అమలులో ఉన్నా ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ లో విదేశీ పర్యటకులు ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వచ్చేస్తున్నారు. భారతదేశంలో కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడానికి లాక్ డౌన్ అమలు చేశారని, మీరు రోడ్ల మీదకు రాకూడదని, మీరు నివాసం ఉంటున్న ప్రాంతాల్లోనే కొన్ని రోజులు ఉండాలని విదేశీ పర్యటకులకు రిషికేశ్ పోలీసులు చెప్పారు. అయినా విదేశీయులు పదేపదే బహిరంగ ప్రదేశాల్లోకి రావడంతో స్థానిక పోలీసులు వారికి చెప్పిచెప్పి విసిగిపోయారు.

జీవితంలో ఇలాంటి తప్పు చెయ్యం !
ఎంత చెప్పినా విదేశీ పర్యాటకులు వినకపోవడంతో పోలీసులకు తిక్కరేగింది. అంతే కొన్ని శ్వేతపత్రాలు (తెల్లకాగితాలు), పెన్నులు తీసుకుని విదేశీయుల దగ్గరకు వెళ్లారు. లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించామని, భారతదేశ చట్టాలను గౌరవిస్తామని, జీవితంలో ఇలాంటి తప్పు మరోసారి చెయ్యమని, మమ్మల్ని క్షమించాలని 500 సార్లు Sorry...Sorry...Sorry... అంటూ వారి చేత రాయిస్తున్నారు.

విదేశీయుల మైండ్ బ్లాక్ !
ఇలా 10 మంది విదేశీయుల చేత Sorry అని 500 సార్లు రాయిస్తున్నారని తెలుసుకున్న మిగిలిన విదేశీయులు ఇప్పుడు వారు ఉంటున్న గదుల నుంచి బయటకు కావడం లేదని రిషికేశ్ కు చెందిన ఓసీనియర్ అధికారి అంటున్నారు. విదేశీయుల దగ్గర తెల్లకాగితాల్లో Sorry, Sorry, Sorry అంటూ పోలీసులు రాయిస్తున్న సమయంలో తీసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విదేశీయులకు ఇలాగే బుద్ది చెప్పాలని, శభాష్ రిషికేశ్ పోలీస్ అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications