Viral Video: చూస్తుండగానే బోల్తా పడిన క్రేన్.. ముగ్గురు మృతి.. వీడియో వైరల్..
తమిళనాడులో ఘోరం జరిగింది. అరక్కోణం సమీపంలో నిర్వహించిన ఓ ఆలయ ఉత్సవాల్లో భక్తులపై క్రేన్ బోల్తా పడడడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. చికిత్స పొందుతూ ఒకరు చనిపోయారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి 8.15 గంటలకు చెన్నై సమీపంలోని నెమిలిలోని కిల్వీధి గ్రామంలో ద్రౌపతి అమ్మన్ ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా భక్తులు వచ్చారు.
దేవతా
విగ్రహాలు
మైలేరు
ఉత్సవాల్లో
భాగంగా
స్థానిక
గ్రామానికి
చెందిన
వారు
క్రేన్పై
దేవతా
విగ్రహాలను
ఊరేగించారు.
భక్తులు
అందిస్తున్న
పూలమాలలను
అమ్మవారికి
అలంకరించేందుకు
25
అడుగుల
ఎత్తైన
క్రేన్పై
ముగ్గురు
వ్యక్తులు
నిలబడి
ఊరేగింపు
కొనసాగించారు.
అయితే
క్రేన్పై
బరువు
ఎక్కువవడటంతో
క్రేన్
ఒక్కసారిగా
బోల్తా
పడింది.
దీంతో
క్రేన్పై
నున్న
ముగ్గురు
వ్యక్తులు
కిందపడి
అక్కడిక్కడే
మృత్యువాత
పడ్డారు.
అయితే ఉత్సవాలను చాలా మంది తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఇలా క్రేన్ బోల్తా పడుతున్నప్పుడు కూడా వీడియో తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
#TamilNadu | 4 people died & 9 others were injured after a #cranecollapsed during a temple festival event in #Keelveethi in #Arakkonam. #BREAKING #craneaccident #arakkonam #Accident #Temple #Death #India | #Crane | #Accident | #Dead | #Injury | #TN | #TempleFestival | pic.twitter.com/iKCjaw7OFV
— Harish Deshmukh (@DeshmukhHarish9) January 23, 2023