హైప్రొఫైల్ మర్డర్: గ్యాంగ్స్టర్ కాల్చివేత - బంద్కు పిలుపు
జైపూర్: కొద్దిరోజుల కిందటే పంజాబ్లో ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు సిద్ధు మూసేవాలా దారుణహత్యకు గురయ్యారు. రౌడీషీటర్లు ఆయనను తుపాకులను కాల్చి చంపారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనేనంటూ అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ హత్య వెనుక అతనిదే మాస్టర్ మైండ్ అంటూ పోలీసులు నిర్ధారించారు. అతని గ్యాంగ్ మొత్తాన్నీ ఏరివేసే పనిలో ఉన్నారు పంజాబ్ పోలీసులు.
ఇప్పుడు తాజాగా రాజస్థాన్ అలాంటి హత్యోదంతమే చోటు చేసుకుంది. హైప్రొఫైల్ గ్యాంగ్స్టర్ రాజు థెట్ హత్యకు గురయ్యాడు. అతని ఇంటి వద్దే బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు దుండగులు. ఈ హత్యలో కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉంది. ఈ హత్యను తానే చేసినట్లు బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన హిస్టరీ రౌడీ షీటర్ రోహిత్ గొదారా ప్రకటించుకున్నాడు. ఇది తన పనేనని వివరించాడు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశాడు.

తన తమ్ముళ్లు ఆనంద్ పల్, బల్బీర్ బనుద హత్యలకు ప్రతీకారాన్ని తీర్చుకున్నట్లు చెప్పాడు. రాజస్థాన్లోని సికార్లో ఈ ఉదయం ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. సికార్ ఉద్యోగ్నగర్ ప్రాంతంలో రాజు థెట్ను కాల్చి చంపాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
బ్లూ జీన్స్ ధరించిన రాజు థెట్ ఇంటి వద్ద నిల్చుని ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతుండటం ఈ వీడియోల్లో రికార్డయింది. అదే సమయంలో మరో ఇద్దరు వక్తులు అక్కడికి రావడం, ఓ ట్రాక్టర్ను అడ్డుగా పెట్టి- రాజు థెట్పై కాల్పులు జరపడం ఇందులో కనిపించింది. మూడు రౌండ్ల పాటు కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. బుల్లెట్ గాయాలతో రాజు థెట్ సంఘటన స్థలంలోనే మరణించాడు. ఆ ప్రదేశం మొత్తం రక్తసిక్తమైంది.
ఈ హత్య తరువాత సికార్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజు థెట్ మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించారు కుటుంబ సభ్యులు. హంతకుడిని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు తేజా సేన బంద్కు పిలుపునిచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. రాజు థెట్ అమర్ రహే అంటు నినాదాలు చేశారు. దుకాణాలను మూసివేయించారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications