రాహుల్ భారత్ జోడో యాత్రలో గౌరీ లంకేష్ కుటుంబసభ్యులు: చేయి పట్టుకుని నడిచారు
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతోంది. ఆయనతో మహిళలు, యువతులు, చిన్నారులు, అనేక మంది కలిసి నడుస్తున్నారు. తాజాగా, హత్యకు గురైన జర్నలిస్టు గౌరీ లంకేశ్ సోదరి కవిత, తల్లి ఇందిరలు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని శుక్రవారం కలిశారు. ఆ తర్వాత ఆయన వెంట నడిచారు.
భారత్ జోడో యాత్ర లంకేష్ లాంటి వారి గొంతుక అని, దానిని ఎప్పటికీ మూయించలేమని అన్నారు కాంగ్రెస్ నేతలు. 'సత్యం కోసం గౌరీ ధైర్యంగా నిలబడ్డారు. గౌరీ స్వాతంత్ర్యం కోసం నిలబడ్డారు. నేను గౌరీ లంకేష్, ఆమె వంటి అసంఖ్యాకమైన భారతదేశ నిజమైన ఆత్మకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. భారత్ జోడో యాత్ర వారి గొంతు. ఇది ఎప్పటికీ నిశ్శబ్దం కాదు' అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

చేయి పట్టుకుని లంకేష్ కుటుంబ సభ్యులతో కలిసి నడుస్తున్న చిత్రాన్ని షేర్ చేస్తూ ట్విట్టర్లో పేర్కొన్నారు. సెప్టెంబర్ 8న కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర ఇప్పటివరకు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటకలో వందల కిలోమీటర్లు ప్రయాణించింది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఈ యాత్ర కొనసాగనుంది.
#WATCH | Indira Lankesh and Kavitha Lankesh - mother and sister of journalist-activist Gauri Lankesh who was murdered in 2017 - walk with Rahul Gandhi, as they participate in Congress' Bharat Jodo Yatra.
— ANI (@ANI) October 7, 2022
Visuals from Bellur Cross in Mandya district of Karnataka. pic.twitter.com/nNHh1sCJQB
కాగా, జర్నలిస్ట్, ఉద్యమకారిణి గౌరీ లంకేష్ సెప్టెంబరు 5, 2017 న దక్షిణ బెంగళూరులోని ఆమె నివాసం ముందు దుండగులు కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయారు. గౌరీ మరణం తరువాత, దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ హత్యపై దర్యాప్తు చేసేందుకు కర్ణాటకలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications