సోదరుడిని కొట్టి గర్ల్ రేప్, మరోచోట యువతిపై రాత్రాంతా
తర్వాత బాధితురాలిపై నిందితుడి స్నేహితుడు కూడా అత్యాచారానికి పాల్పడ్డాడని, బాలికను రక్షించేందుకు వచ్చిన సోదరుడిని ఇద్దరు కామాంధులు చావబాదారని పోలీసులు తెలిపారు. ఘటనపై బాధితురాలి తండ్రి శనివారం జమురియా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఒక నిందితుడిని అరెస్టు చేసి బాధితురాలిని అసన్సోల్ సబ్ డివిజనల్ ఆస్పత్రికి తరలించారు. బాలిక సామూహిక అత్యాచారానికి గురైనట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరోవైపు, ఇరవై రెండేళ్ల యువతిపై వరసగా రెండు రోజుల పాటు కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన అసోంలోని నాగోన్లో శనివారం వెలుగు చూసింది. అయిదు నుంచి ఏడుగురు యువకులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
శివసాగర్కు చెందిన బాధితురాలు నాగోన్లోని స్టేట్ హోమ్లో ఉంటూ, అక్కడ వేధింపు చర్యలకు తాళలేక గత నెల 30న బయటకు వచ్చేసింది. మానసిక పరిస్థితి సరిగా లేని ఆమెను అయిదు నుంచి ఏడుగురు యువకులు బిపి పౌర ఆస్పత్రి సమీపంలోకి తీసుకుని పోయి ఒక రాత్రంతా అత్యాచారం చేశారు. ఓ అజ్ఞాత ప్రదేశంలో ఆమెను ఉంచి నిందితులు రెండో రోజు కూడా అత్యాచారం చేశారు. ఆ తర్వాత శనివార ఆసుపత్రిలో చేర్పించారు.