కేంద్రమంత్రి కూతురుకు వేధింపులు!
సాధారణ మహిళలు, యువతులే కాదు.. ఏకంగా కేంద్రమంత్రి కుటుంబసభ్యులు కూడా ఆకతాయిల వేధింపుల నుంచి తప్పించుకోవడం లేదు. తాజాగా, కేంద్రమంత్రి కూతురును వేధింపులకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో శాంతిభద్రతలపై కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే ఆందోళన వ్యక్తం చేశారు.
జల్గావ్ జిల్లా ముక్తాయ్నగర్లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తన కుమార్తెను, ఆమె స్నేహితులను కొందరు యువకులు వేధించారని కేంద్రమంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురిపై ముక్తైనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ఒకరిని షోహమ్ మాలి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.

మహాశివరాత్రి సందర్భంగా తమ ప్రాంతంలో ఏటా సంత్ ముక్తాయ్ యాత్ర నిర్వహిస్తారని కేంద్రంమత్రి తెలిపారు. ఇటీవల నిర్వహించిన యాత్రకు స్నేహితులతో కలిసి వెళ్తానని తన కుమార్తె కోరిందని.. దీంతో సెక్యూరిటీ గార్డుల సాయంతో అక్కడకు పంపించినట్లు చెప్పారు. ఆ సమయంలో కొందరు యువకులు వారిని వెంబడించి వేధించారని తెలిపారు.
అంతేగాక, అడ్డుకున్న భద్రతా సిబ్బందిపైనా దురుసుగా ప్రవర్తించారని కేంద్రమంత్రి తెలిపారు. గుజరాత్ పర్యటన నుంచి తాను ఇంటికి రాగానే తన కూతురు ఈ విషయం చెప్పిందన్నారు. ఓ ఎంపీ లేదా కేంద్ర మంత్రి కుమార్తెకే ఇలాంటి దుస్థితి ఎదురైతే.. సాధారణ మహిళల పరిస్థితి ఏంటో ఆర్థం చేసుకోవచ్చని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు కేంద్రమంత్రి రక్షా ఖడ్సే తెలిపారు.
ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. నిందుతులు ఓ రాజకీయ పార్టీకి చెందినవాళ్లని, అందులో కొందర్ని పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. వారిపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు, మహాయుతి ప్రభుత్వ హయాంలో సామాన్యులకే కాదు.. కేంద్రమంత్రి కుటుంబసభ్యులకు కూడా రక్షణ లేకుండా పోయిందని ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications