చెన్నైకి గవర్నర్ విద్యాసాగర్ రావ్: రాజ్ నాథ్ సింగ్ ఏం చెప్పారు ? టెన్షన్ మొదలైయ్యింది !
తమిళానాడు రాజకీయాలు రవసవత్తరంగా మారడంతో ఆరాష్ట్ర ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ శనివారం చెన్నై చేరుకుంటున్నారు.
చెన్నై: తమిళానాడు రాజకీయాలు రవసవత్తరంగా మారడంతో ఆరాష్ట్ర ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ శనివారం చెన్నై చేరుకుంటున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గవర్నర్ విద్యాసాగర్ రావ్ తో భేటీ కానున్నారు.
షాక్: ఎమ్మెల్యేలా మజాకా: దినకరన్ కు హ్యాండ్ ఇచ్చి పళని, పన్నీర్ తో బేరం పెట్టారు !
అన్నాడీఎంకే పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం మీద అసంతృప్తి వ్యక్తం చేసి తిరుగుబాటు చేసిన సమయంలో గవర్నర్ విద్యాసాగర్ రావ్ చెనై చేరుకోవడంతో టెన్షన్ మొదలైయ్యింది.
Recommended Video
గవర్నర్ విద్యాసాగర్ రావ్ ను టీటీవీ దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యేలు కలిసే అవకాశం ఉందని తెలిసింది. తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షం అయిన డీఎంకే పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు స్టాలిన్ గవర్నర్ తో భేటీ అయ్యి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వాలని విద్యాసాగర్ రావ్ కు మనవి చెయ్యడానికి సిద్దం అయ్యారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో చర్చలు జరిపిన తరువాత గవర్నర్ విద్యాసార్ రావ్ చెన్నై చేరుకుంటున్న సందర్బంగా తమిళనాడులోని ప్రభుత్వానికి టెన్షన్ మొదలైయ్యింది.