డబుల్ హ్యాట్రిక్: ఆముగ్గుర్నీ పట్టుకున్న మోడీ: బీజేపీ గెలుపుకు కాంగ్రెస్ కారణం !
అహ్మదాబాద్: గుజరాత్ లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు యత్నిస్తున్న బీజేపీకి అభివృద్ధి ఎజెండా తప్ప మరో మార్గం లేదు. పాటీదార్లు సైతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఏం చెయ్యాలి అంటూ బీజేపీ ఆలోచిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ల రూపంలో ప్రధాని నరేంద్ర మోడీకి వరుస అవకాశాలు లభించాయి.

దేవుడి రూపంలో చిక్కారు
రాహుల్ గాంధీ చేసిన ఓ సంతకం, సుప్రీం కోర్టులో కపిల్సిబల్ వాదనలు, ప్రధాని నరేంద్ర మోడీపై మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీశాయి. ఈ మూడు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చగా బీజేపీ చేతికి అస్త్రాలను అందించాయి. దేవుడి రూపంలో వచ్చిన ఈ మూడు అవకాశాలను బీజేపీ నాయకులు చక్కగా ఉయోగించుకున్నారు.

రాహుల్ గాంధీ
హిందుత్వ ప్రయోగశాలగా భావించే గుజరాత్లో హిందూ దేవాలయాలను రాహుల్ గాంధీ సందర్శించడంపై బీజేపీ విమర్శలు సంధించింది. సోమ్నాథ్ ఆలయంలో హిందూయేతర రిజిస్టర్లో రాహుల్ గాంధీ సంతకం చేయడం వివాదాస్పదమైంది. రాహుల్ గాంధీ సంతకం విషయంలో బీజేపీ హిందువులను టార్గెట్ చేసుకుంది. రాహుల్ గాంధీ తాను హిందువు కాదని ఆయనే అంగీకరిస్తు సోమనాథ్ ఆలయంలోని రిజిస్టర్ లో సంతకం చేశారని బీజేపీ ఆరోపించింది.

సుప్రీం కోర్టులో కపిల్
అయోధ్య భూ వివాదంలో 2019 లోక్ సభ ఎన్నికల తరువాత విచారణ చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీం కోర్టులో వాదించారు. ఈ విషయాన్ని పట్టుకున్న మోడీ గుజరాత్ ఎన్నికల సందర్బంగా ఇక్కడ ఆలయాలు తిరుగుతున్న కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టులో రామ మందిరం నిర్మాణాన్ని అడ్డుకుంటోందని ఆరోపణలు గుప్పించారు.

హిందూత్వ ఎజెండా
గుజరాత్ శాసన సభ ఎన్నికల సందర్బంగా బీజేపీ మళ్లీ హిందూత్వ ఎజెండాను నమ్ముకుంది. అది కాంగ్రెస్ రూపంలో రావడంతో బీజేపీ ఆ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంది. కాంగ్రెస్ పార్టీని ఎక్కడ దెబ్బకోట్టాలో అక్కడే బీజేపీ దెబ్బ కొట్టింది. హిందువుల ఓట్లు చీలిపోకుండా జాగ్రత్తలు తీసుకుంది.

అయ్యారే అయ్యర్
2014 లోక్ సభ ఎన్నికల సందర్బంగా ప్రధానిని చాయ్ వాలా అంటూ విమర్శించిన కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మణిశంకర్ అయ్యర్ 2017లో ప్రధాని నరేంద్ర మోడీకి మరో చక్కటి అవకాశం ఇచ్చారు. ప్రధాని మోడీ నీచుడు (నీచ్) అంటూ విమర్శించిన మణిశంకర్ అయ్యర్ బీజేపీ చేతికి మంచి అస్త్రం అదించారు. తనను మాత్రమే నీచుడు అని మణిశంకర్ అయ్యర్ విమర్శించలేదని, ప్రతి గుజరాతీని ఆయన అవమానించారని ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభల్లో ఆరోపణలు చేశారు.

పాకిస్థాన్ తెరమీదకు
మణింకర్ అయ్యర్ మరో సారి బీజేపీకి ఒక అవకాశం ఇచ్చారు. తన ఇంటికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప రాష్ట్రపతి హామీద్ అన్సారీ, పాక్ అధికారులను పిలిపించి సమావేశం నిర్వహించారు. దాయాది పాకిస్థాన్ ను అడ్డం పెట్టుకున్న బీజేపీ మమల్ని ఓడించడానికి శత్రు దేశం పాక్ తో చేతులు కలిపిన కాంగ్రెస్ కు తగిన బుద్ది చెప్పాలని గుజరాత్ ఎన్నికల్లో ప్రచారం చేసింది. చేతికి చిక్కిన ఈ అవకాశాలను బీజేపీ చక్కగా సద్వినియోగం చేసుకోవడంతో గుజరాత్ లో ఆరో సారి అధికారంలోకి వస్తోంది. ఈ వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీశాయి.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications