హర్దిక్ పటేల్: దేశ ద్రోహం కేసు నమోదు
అహ్మదాబాద్: పటేళ్లను ఓబీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తున్న హర్దిక్ పటేల్ మీద సూరత్ పోలీసులు దేశ ద్రోహం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇప్పుడు హర్దిక్ పటేల్ మీద నమోదు చేసిన కేసు విషయంలో పటేళ్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
పటేళ్లను ఓబీసీలలో చేర్చాలని హర్దిక్ పటేల్ ఆదివారం రాజ్ కోట్ లో నిరసన వ్యక్తం చెయ్యడానికి సిద్దం అయిన విషయం తెలిసిందే. భారత్- దక్షిణ ఆఫ్రికా జట్ల మద్య జరుగుతున్న వన్డే మ్యాచ్ ను అడ్డుకోవడానికి వెళ్లారు.

ఆ సందర్బంలో జాతీయ జెండాను చేతపట్టుకున్న హర్దిక్ పటేల్ తన అనుచరులతో కలిసి కారు దిగాడు. కారు దిగుతున్న సమయంలో జాతీయ జెండా హర్దిక్ పటేల్ కాలుకు చిక్కుకుందని, దేశాన్ని అవమానించే విధంగా అతను ప్రవర్తించాడని కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ గగన్ దీప్ అన్నారు.
అదే విధంగా పటేళ్లను రెచ్చగొట్టి ప్రసగించి గొడవలు జరగడానికి ప్రయత్నిస్తున్నాడని హర్దిక్ మీద కేసు నమోదు చేశారు. రిజర్వేషన్ల కోసం పటేల్ యువకులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోరాదని, అవసరమైతే పోలీసులను చంపాలని ఈనెల 3వ తేదిన హర్దిక్ పటేల్ సూరత్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు అయ్యింది.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications