Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాంగ్రెస్ రెండు తలల పాము, వాడోరకం, వీడోరకం, మోదీ విషయంలో క్లారిటీ ఉందా !

రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు మంజూరు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపిస్తూ ఫిబ్రవరి 6వ తేదీన చలో ఢిల్లీ నిరసనకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంపై ఆ రాష్ట్ర మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ రెండు తలల పాములాగా తయారైయ్యింది. కేంద్ర ప్రభుత్వం విషయంలో ఆ పార్టీ రెండు రకాలుగా మాట్లాడుతోందని మాజీ సీఎం కుమారస్వామి దుయ్యబట్టారు.

పన్నుల వాటా, గ్రాంట్లు కేటాయించడంలో కర్ణాటక రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందంటూ ఛలో ఢిల్లీ యాత్రకు బయలుదేరుతున్న కాంగ్రెస్ పార్టీ రెండు తలల రాజకీయం చేసి చివరికి ఎటూ కాకుండా పోతున్నదని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు కర్ణాటకలో ఒక విధానంగా ఉందని. కేరళలో మరో విధానంగా ఉందని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న మాజీ సీఎం కుమారస్వామి కాంగ్రెస్ రాజకీయాలపై విమర్శలు గుప్పించారు.

 HD Kumaraswamy alleged that the behavior of Congress leaders is one type in Kerala and another in Karnataka.

కేరళ సీఎం పినరయి విజయన్ ఇటీవల మాట్లాడుతూ కేరళ రాష్ట్రానికి పన్నుల వాటా, గ్రాంట్లు కేటాయించడంలో అన్యాయం జరుగుతోంది. కేంద్రంపై మనం గళం విప్పాలని, అందరూ కలిసి వచ్చి కేరళ ప్రభుత్వానికి సహకరించండి అంటూ కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు మనవి చేశారని కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి గుర్తు చేశారు. మీరు అనవసర ఖర్చులకు ప్రజల సొమ్మును వృధా చేస్తున్నారని, మీతో కలిసి మేం రావడం లేదని కేరళ కాంగ్రెస్ నాయకులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు తేల్చి చెప్పారని, కేరళ సీఎం పినరయి విజయన్‌ పిలుపునిచ్చిన అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ నాయకులు హాజరుకాలేదని కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి ఆరోపించారు.

 HD Kumaraswamy alleged that the behavior of Congress leaders is one type in Kerala and another in Karnataka.
కేరళ శాసనసభలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి సభా కార్యక్రమాలను బహిష్కరించినప్పుడు కూడా పినరయి విజయన్ ప్రభుత్వానికి కేరళలో కాంగ్రెస్ నాయకులు సహకరించలేదని, అంతే కాకుండా ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీలో కేరళ సీఎం పినరయి విజయన్ నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమాన్ని కేరళ కాంగ్రెస్ నాయకుల బహిష్కరించారని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ నాయకుల తీరు ఓ రకంగా ఉందని, కేరళలో అదే కాంగ్రెస్ నాయకుల తీరు మరో రకంగా ఉందని, ఒకే పార్టీకి చెందిన నాయకులు కేంద్ర ప్రభుత్వం మీద రెండు రకాలుగా వ్యవహరిస్తోందని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి మండిపడ్డారు. కర్ణాటకలో కూడా ఉచిత హామీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తోందని జేడీఎస్ నాయకుడు, మాజీ సీఎం కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ మీద మండిపడ్డారు.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+