తీరాన్ని తాకిన హెలెన్ తుఫాన్, ఇద్దరు మృతి(పిక్చర్స్)
హైదరాబాద్: హెలెన్ తుఫాను శుక్రవారం మధ్యాహ్నం మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకింది. తీరాన్ని తాకడానికి ముందు వేగంగా గాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. కోస్తాలో భీకర తుఫాను కురుస్తోంది. తుఫాను దాటికి రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందారు. కోస్తాంధ్రలో నీటి అలలు ఒకటి నుండి ఒకటిన్నర మీటర్లు ఎత్తుకు ఎగిసిపడ్డాయి.
మచిలీపట్నం వద్ద మధ్యాహ్నం తీరాన్ని తాకిన తుఫాను సాయంత్రం తీరాన్ని దాటింది. మరికొద్ది గంటల్లో ఇది క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారనుంది. దీంతో కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి.
కాగా, హెలెన్ తుఫాను తీరం వైపు దూసుకొస్తున్నట్లుగా ఉదయం నుండి అధికారులు హెచ్చరిస్తున్నారు. నేడు మధ్యాహ్నం హెలెన్ తుఫాను మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశముందని చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన హెలెన్ తుఫాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాగల 24 గంటల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
హెలెన్ తీరం దాటే సమయంలో వంద నుండి నూటా యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చునని చెప్పారు. 25 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం కురిసే అవకాశముందని చెప్పారు. ఉదయం హెలెన్ మచిలీపట్నానికి తూర్పు దిశలో 85 కిలోమీటర్ల దూరంలో, నర్సాపురానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. హెలెన్ తుఫాను కోస్తా ప్రాంతాన్ని అలజడికి గురి చేసింది. తీర ప్రాంతంలో సముద్రం కొన్ని చోట్ల ముందుకు వచ్చింది. అలలు ఎగిసిపడ్డాయి. సముద్రంలో వేటను నిషేధించారు.
నిజాంపట్నం, మచిలీపట్నం ఓడ రేవుల్లో పదో ప్రమాద హెచ్చరిక, కాకినాడలో తొమ్మిదో ప్రమాద హెచ్చరిక, కృష్ణపట్నం, గంగవరం, విశాఖ, కళింగపట్నం ఓడరేవుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
హెలెన్ తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. తీర ప్రాంతంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పలు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.

హెలెన్
హెలెన్ తుఫాను తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించిన నేపథ్యంలో నిలిచిపోయిన పడవలు.

హెలెన్ 2
హెలెన్ తుఫాను తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించిన నేపథ్యంలో ఒడ్డుకు తరలి వస్తున్న ఓ పడవ.

హెలెన్ 3
హెలెన్ తుఫాను తీరం వైపు దూసుకొస్తోంది. నేడు మధ్యాహ్నం హెలెన్ తుఫాను మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశముంది. బంగాళాఖాతంలో ఏర్పడిన హెలెన్ తుఫాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాగల 24 గంటల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురువనున్నాయి.

హెలెన్ 4
కృష్ణా - పశ్చిమ గోదావరి మధ్య మధ్యాహ్నం మూడు నుండి నాలుగు గంటల మధ్య హెలెన్ తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications