Hijab Row: జాతీయ జెండాను దింపేసి కాషాయం జెండా ఎగరేసిన విద్యార్థులు, లాఠీచార్జ్, 144 సెక్షన్ !
బెంగళూరు/ శివమొగ్గ/ హైదరాబాద్: హిజాబ్ వివాదం రోజురోజుకు ముదిరిపోతోంది. హిజాబ్ (బుర్కా) వేసుకుని మేము కాలేజ్ కు వస్తామని ముస్లీం అమ్మాయిలు పట్టుబడుతున్నారు. హిజాబ్ లు వేసుకోవడానికి అమ్మాయిలకు అనుమతి ఇస్తే మేము కూడా కాషాయం కండువాలు వేసుకుని వస్తాయని కొందరు అబ్బాయిలు పట్టుబడుతున్నారు. హైదరాబాద్ కు చెందిన కొన్ని స్వచ్చంద సంస్థలు ఇప్పటికే కర్ణాటక చేరుకుని ముస్లీం అమ్మాయిలకు మద్దతు ఇచ్చారు. ఇక శివమొగ్గ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో 144 సెక్షన్ అమలు చేశారు. ఇప్పటికే పోలీసులు లాఠీలకు పని చెప్పి ఎగిరిపడుతున్న కొందరికి దేహశుద్ది చేశారు. జాతియ జెండా ఎగరవేయడానికి ఏర్పాటు చేసిస స్థంభానికి కషాయం జెండా కట్టడంతో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రాజకీయ వివాదం
కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో విద్యాసంస్థల్లో ముస్లీం అమ్మాయిలు బుర్కాలు వేసుకుని వస్తే మేము కూడా కాషాయం కండువాలు వేసుకుని నుదిటి మీద సింధూరం పెట్టుకుని కాలేజ్ లోకి వస్తామని హిందులు పట్టుబడుతున్నారు. కాలేజ్ విద్యార్థుల గొడవలతో మొదలైన బుర్కాల వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది.

నిలదీస్తున్న విద్యార్థులు
విద్యాసంస్థల్లో ముస్లీం అమ్మాయిలు బుర్కాలు వేసుకుని వస్తే మేము కూడా కాషాయం కండువాలు వేసుకుని నుదిటి మీద సింధూరం పెట్టుకుని కాలేజ్ లోకి వస్తామని హిందులు పట్టుబడుతున్నారు. ఇప్పుడు ఉడిపి జిల్లాలో మొదలైన హిజాబ్ వివాదం కర్ణాటక వ్యాప్తంగా వ్యాపించింది. విద్యాసంస్థల ఆవరణంలో హిజాబ్ ధరించి రాకూడదని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాలేజ్ ల్లోకి ఇన్ని సంవత్సరాలు హిజాబ్ ధరించి వచ్చి చదువుకున్నామని, అప్పుడు లేని నియమాలు ఇప్పుడు ఎందుకు అంటూ ముస్లీం అమ్మాయిలు కాలేజ్ ప్రిన్సిపాల్, అధ్యాపకులను నిలదీస్తున్నారు.

ఉడిపిలో 144 సెక్షన్
బుర్కాలు ధరించే విషయంలో శివమొగ్గలో రెండు వర్గాల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. మేము బుర్కాలు వేసుకుని కాలేజ్ కు వస్తామని ఓ వర్గం వారు ర్యాలీ నిర్వహించారు. పోటాపోటీగా మేము కూడా కాషయం కండువాలు వేసుకుని కాలేజ్ కు వెలుతామని మరో వర్గం వాళ్లు ర్యాలీ నిర్వహించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోటాపోటిగా ర్యాలీలు నిర్వహించడంతో శివమొగ్గలో పోలీసులు ఇరు వర్గాల ర్యాలీలు అడ్డుకొవడానికి 144 సెక్షన్ అమలు చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Recommended Video

జాతీయ జెండానే దింపేసిన విద్యార్థులు
కాలేజ్ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో శివమొగ్గలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్బంలో కొందరు విద్యార్థులు కాషయం కండువాలు వేసుకుని ర్యాలీగా వెళ్లారు. జాతియ జెండా ఎగరవేయడానికి ఏర్పాటు చేసిస స్థంభానికి కషాయం జెండా కట్టడంతో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషమం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కాలేజ్ విద్యార్థి జాతీయ జెండాను కిందకు దింపి కాషాయం జెండాను ఎగరవేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications