రెడ్ అలర్ట్- ప్రయాణాలు వాయిదా వేసుకోవాలంటూ ప్రభుత్వం విజ్ఞప్తి..!!
సిమ్లా: భారీ వర్షాలు.. ఉత్తరాది రాష్ట్రాలను వదలట్లేదు. అల్లకల్లోలానికి గురి చేస్తోన్నాయి. ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలకు నదులు పోటెత్తుతున్నాయి.. ఉప్పొంగి ప్రవహిస్తోన్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్.. ఇలా ఉత్తరాదిలోని పలు రాష్ట్రాలు అతలాకుతలమౌతోన్నాయి. రికార్డు స్థాయి వర్షపాతం ఆయా రాష్ట్రాల్లో నమోదవుతోంది.
Scary visuals from Thunag area of Mandi, Himachal!!#HimachalPradesh pic.twitter.com/vLotOdkzD0
— Queen of Himachal (@himachal_queen) July 9, 2023
హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ.. భారీ వర్షాలకు చివురుటాకులా వణికిపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో బియాస్, రావి, సట్లేజ్.. నదులు మహోగ్రరూపాన్ని దాల్చాయి. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోన్నాయి. ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. యమునా నది ఉప్పొంగింది. హిమాచల్లో అన్ని రిజర్వాయర్లో నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరుకుంది. వాటి గేట్లన్నింటినీ ఎత్తివేశారు అధికారులు.

దీని ప్రభావం తీర ప్రాంతాలపై పడింది. బియాస్, రావి, సట్లేజ్ నదుల తీరప్రాంతాలన్నీ మునిగిపోయాయి. అక్కడి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు అధికారులు. ఇప్పటివరకు లక్ష మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. కొండ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం ప్రళయాన్ని తలపించేలా విరుచుకుపడటం వల్ల పలు పట్టణాలు సగం వరకు నీట మునిగాయి.
Corner of Koku Nalla Bridge Collapsed
— Weatherman Shubham (@shubhamtorres09) July 10, 2023
10th July 2023
Theog - Hatkoti Road
Shimla #HimachalPradesh pic.twitter.com/O3kHyDWEtt
బిలాస్పూర్, సోలన్, సిమ్లా, సిర్మౌర్, ఉనా, హమీర్పూర్, మండి, కుల్లు-మనాలి, కిన్నౌర్, చంబా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. ఆయా జిల్లాల్లో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వచ్చే మూడు రోజుల పాటు మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తాజాగా హెచ్చరించింది. ఆయా జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది.
Big Scale Damage in Himachal Pradesh 🙏🏻🙏🏻
— Weatherman Shubham (@shubhamtorres09) July 10, 2023
Live Visuals from Parwanoo
10th July 2023
Solan , Himachal Pradesh pic.twitter.com/5zTAzo8K2w
ఇతర జిల్లాలకు వర్షాలు విస్తరిస్తాయని, ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని ఐఎండీ సూచించింది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం హెల్ప్లైన్ సెంటర్లను నెలకొల్పింది. 24 గంటల పాటు పని చేసేలా వాటిని ఏర్పాటు చేసింది. ఈ హెల్ప్లైన్ కేంద్రాల నంబర్లు...1100, 1070, 1077.

అత్యవసరం అయితేనే తప్ప ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటికి రావొద్దని విజ్ఞప్తి చేసింది. కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉన్నందున ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది ప్రభుత్వం. మూడు జాతీయ రహదారులతో సహా మొత్తం 736 రోడ్లను మూసివేసినట్లు రహదారుల శాఖ మంత్రి తెలిపారు. పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చేంత వరకు ప్రయాణాలు మానుకోవాలని అన్నారు.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!!












Click it and Unblock the Notifications