చనిపోతూ ప్రొఫెసర్ బండారం బయటపెట్టింది: విద్యార్థిని సెల్ఫీ వీడియో వైరల్!
హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని.. ప్రొఫెసర్, తోటి విద్యార్థుల వేధింపులు భరించలేక ప్రాణాలు కోల్పోయింది. చనిపోయే ముందు ఆమె తన ఆవేదనను సెల్ఫీ వీడియోలో రికార్డు చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
వీడియోలో ఏముందంటే?
ఆ విద్యార్థిని తన చివరి వీడియోలో కాలేజీ ప్రొఫెసర్ అశోక్ కుమార్ తన పట్ల ఎంత అసభ్యంగా ప్రవర్తించేవాడో వివరించింది. క్లాస్ రూమ్లోనూ, క్యాంపస్లోనూ ప్రొఫెసర్ తనను అనుచితంగా తాకేవాడని, మానసిక వేధింపులకు గురిచేసేవాడని ఆరోపించింది. ఈ విషయాన్ని బయట చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తనను బెదిరించినట్లు ఆమె ఆ వీడియోలో పేర్కొంది. బాధితురాలి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. సెప్టెంబర్ 18న హర్షిత, ఆకృతి, కోమలిక అనే ముగ్గురు విద్యార్థినులు తన కూతురిని దారుణంగా ర్యాగింగ్ చేసి కొట్టారు. దీనికి తోడు ప్రొఫెసర్ వేధింపులు కూడా తోడవడంతో ఆమె తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం క్షీణించింది. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన అనంతరం, డిసెంబర్ 26న లూథియానాలోని ఒక ఆస్పత్రిలో ఆమె తుది శ్వాస విడిచింది.

పోలీసుల దర్యాప్తు
మొదట ర్యాగింగ్ కోణంలోనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. వీడియో బయటకు రావడంతో ప్రొఫెసర్ అశోక్ కుమార్పై కూడా కేసు నమోదు చేశారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS), హిమాచల్ ప్రదేశ్ విద్యా సంస్థల (ర్యాగింగ్ నిషేధ) చట్టం కింద కేసులు నమోదయ్యాయి. కాగా ఈ ఘటనతో తమకు సంబంధం లేదని కాలేజీ యాజమాన్యం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది.
-
Viral Video: రైల్వే బోగీనా..? లేక బార్ అండ్ రెస్టారెంట్ అనుకున్నారా..? -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో -
బ్రావో ఇంట్లో ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరు? రహస్యాలు లీక్! వీడియో -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications