అన్నకు రాఖీ కట్టాలని భార్య రూ. 10 అడిగింది, దేశానికి నష్టం లేదని భర్త అన్నాడు, చివరికి ?
బెంగళూరు: అన్నకు రాఖీ కట్టాలని, రూ. 10 ఇవ్వాలని భర్తను భార్య అడిగింది. మీ అన్నకు రాఖీ కట్టకపోతే దేశానికి ఏమీ నష్టం లేదని భర్త చెప్పాడు. అన్నకు రాఖీ కట్టలేని ఈ జీవితం ఎందుకు అంటూ ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లా మలప్రభ పట్టణంలో జరిగింది.
మలప్రభ పట్టణంలోని శహాపుర ప్రాంతలో అశోక్, మహదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. సోమవారం రాఖీ పండుగ సందర్బంగా తన అన్నకు రాఖీ కట్టాలని, రూ. 10 ఇవ్వాలని మహాదేవి ఆమె భర్త అశోక్ ను అడిగింది. రూ. 10 ఇవ్వడానికి అశోక్ నిరాకరించాడు.

రూ. 10 ఇవ్వడానికి నిరాకరించిన అశోక్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అన్నకు రాఖీ కట్టడానికి తన భర్త రూ. 10 ఇవ్వలేదని, తన సోదరుడు ఎమనుకుంటాడని మహాదేవి కుమిలిపోయింది. తన అన్నకు ఫోన్ చేసిన మహాదేవి జరిగిన విషయం చెప్పింది. ఆమె సోదరుడు పర్వాలేదు మంగళవారం నేను ఇంటికి రాఖీ తీసుకుని వస్తానని చెప్పాడు.
అయితే సోమవారం రాత్రి మహాదేవి ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం మహాదేవి ఆత్మహత్య చేసుకుందనే విషయం గుర్తించిన ఆమె భర్త అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications