హుందాయ్ పాకిస్థాన్ వివాదం: దక్షిణ కొరియాకు సమన్లు, విదేశాంగ మంత్రికి ఫోన్, విచారం
న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ పాకిస్థాన్ వివాదంలో చిక్కుకుంది. కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్కు సపోర్ట్ చేసిన పోస్టు తీవ్ర దుమారాన్ని రేపింది. హ్యుందాయ్ పాకిస్థాన్ పోస్టుకు వ్యతిరేకంగా భారత్ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం (Kashmir Solidarity Day) సందర్భంగా హ్యుందాయ్ పాకిస్థాన్ పోస్ట్ చేయడం ఆందోళనకు దారితీసింది.
అంతేగాక, ఈ వ్యవహారంలో దక్షిణ కొరియా రాయబారికి సమన్లు జారీ చేసినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఫిబ్రవరి 5న హ్యుందాయ్ పాకిస్థాన్.. కాశ్మీర్కు సంబంధించి సోషల్ మీడియా పోస్ట్ పెట్టింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాల్సిందిగా మంత్రిత్వ శాఖ రాయబారిని కోరింది. సియోల్లోని భారత రాయబారి శ్రీప్రియ రంగనాథన్ కూడా హ్యుందాయ్ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. ఈ వివాదాస్పద పోస్టుపై హ్యుందాయ్ మోటార్స్ ఇండియా తక్షణమే భారత్కు క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద సంఖ్యలో నెటిజన్లు, పలువురు రాజకీయ నేతలు డిమాండ్ చేస్తున్నారు. #BoycottHyundai అంటూ ట్విట్టర్ ట్రెండ్ చేస్తున్నారు.

కాగా, భారత ప్రజలను ఇబ్బందులకు గురిచేసినందుకుగానూ చింతిస్తున్నట్లు హుందాయ్ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, తాజాగా ఈ వివాదంపై ఆ కంపెనీ సొంత దేశమైన దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి.. భారత విదేశాంగ మంత్రితో మాట్లాడి విచారం వ్యక్తం చేసినట్లు తెలిపినట్లు కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ తెలిపారు. మరోవైపు, ఈ వ్యవహారంలో భారత్లోని దక్షిణ కొరియా రాయబారికి సమన్లు జారీ అయ్యాయి.
హ్యుందాయ్ పాకిస్థాన్ పేరుతో ఉన్న ఖాతాలో కాశ్మీర్ ను ప్రస్తావిస్తూ చేసిన పోస్ట్ మా దృష్టికి వచ్చింది. ఆ పోస్టును చూసిన వెంటనే గత ఆదివారం దక్షిణకొరియా రాజధాని సియోల్ లోని మన రాయబారి హుందాయ్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి వివరణ కోరారు. ఆ తర్వాత కొద్ది సేపట్లోనే సోషల్ మీడియా నుంచి ఆ పోస్టును డిలీట్ చేయించారు. సోమవారం రిపబ్లిక్ ఆఫ్ కొరియా భారత రాయబారికి కూడా కేంద్ర విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. ఈ వ్యవహారంపై దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చుంగ్ ఇయ్ యాంగ్.. భార త విదేశాంగ మంత్రి జైశంకర్ తో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడినట్లు బాగ్చీ తెలిపారు. వివిధ విషయాలతోపాటు హుందాయ్ అంశం కూడా వీరి చర్చలో వచ్చింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications