నేను ఎవ్వరినీ రేప్ చెయ్యలేదు, ఎవరి చీరలు లాగలేదే ?, ఇది మాజీ డిప్యూటీ సీఎం తీరు !
బెంగళూరు/బెళగావి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి బీజేపీ హైకమాండ్ అవకాశం ఇవ్వకపోవడంతో ఆ పార్టీ రెబల్స్ ఎక్కువ అయ్యారు. నేను ఏమైనా ఎవరినైనా రేప్ చేశానా ?, ఎవరి చీరలైనా లాగేశానా, ఆ రోజు ఉప ముఖ్యమంత్రి పదవి లాక్కొన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకుండా అవమానించారని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ సవది మండిపడ్డారు.
గురువారం బెళగావి జిల్లాలోని అథణిలో మాజ ఉప ముఖ్యమంత్రి లక్షణ సవది మీడియాతో మాట్లాడుతూ బీజేపీలోకి కొందరు నాయకుల మీద మండిపడ్డారు. బీజేపీలో తనను కొందరు మానసికంగా హింసించారని లక్ష్మణ సవది ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తనకు ఒక్కమాట కూడా చెప్పకుండా ఆ పదవి నుంచి కిందకు దించేశారని లక్ష్మణ సవది ఆరోపించారు.

ఆ రోజు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యాలని తనకు చెప్పిఉంటే సంతోషంగా రాజీనామా చేసి ఉండేవాడినని, అలా చెయ్యకండా తనను పదవి నుంచి తప్పించి అవమానించారని, అంత జరిగినా తాను ఎవరిని ఉద్దేశించి తప్పుగా మాట్లాడలేదని మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది విచారం వ్యక్తం చేశారు.
ఆ రోజు ఉప ముఖ్యమంత్రి పదవి పీకేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకుండా అవమానించారని లక్ష్మణ సవది మండిపడ్డారు. బీఎల్. సంతోష్ తన గురువు అని, ఆయన గురువారం ఉదయం నుంచి నాలుగు సార్లు తనకు ఫోన్ చేశారని, ఆవేశంలో ఉన్న తాను ఏదైనా పొరపాటుగా మాట్లాడితే తన గురువు బాధపడుతారని తాను ఫోన్ రిసీవ్ చెయ్యలేదని లక్ష్మణ సవది మీడియాకు చెప్పారు.

ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదని మాత్రమే తాను బీజేపీకి రాజీనామా చెయ్యడం లేదని. ఆ పార్టీలోని కొందరు తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని, తన అభిమానం చంపుకోలేక తాను బీజేపీలో నుంచి బయటకు వెళ్లిపోతున్నానని లక్ష్మణ సవది చెప్పారు. శుక్రవారం బెంగళూరు వెళ్లి బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తరువాత తాను ఏం చెయ్యాలో అది చేస్తానని మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది ఆవేశంతో చెప్పారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications