Illegal affair: లేడీ రైంజర్, కానిస్టేబుల్ అక్రమ సంబంధం, పిల్లల తల్లితో పెళ్లి టాపిక్, ఫినిష్ !
బెంగళూరు: కానిస్టేబుల్ ఉద్యోగాలు సంపాధించాలని కోచింగ్ సెంటర్ కు వెలుతున్న యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. కోచింగ్ సెంటర్ లో ప్రేమలో పడిన యువతి, యువకుడు పెళ్లికి ముందే అడ్వాన్స్ గా శారీరకంగా దగ్గర అయ్యారు. పోలీసు ఉద్యోగాలు రాకముందే శారీరక సంబంధం పెట్టుకుని ఇద్దరూ ఏకాంత ప్రదేశాలకు వెళ్లి పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. ప్రియుడికి పోలీసు ఉద్యోగం రావడంతో ప్రియురాలికి హ్యాండ్ ఇచ్చి వేరే యువతిని వివాహం చేసుకుని వెళ్లిపోయాడు. కొంతకాలం తరువాత ప్రియురాలికి ఫారెస్టు డిపార్ట్ మెంట్ లో రైంజర్ గా ఉద్యోగం వచ్చింది. వేరే యువకుడిని వివాహం చేసుకున్న లేడీ రైంజర్ భర్తతో కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది.
రైంజర్ గా ఉద్యోగం చేస్తున్న మాజీ ప్రియురాలికి ఆమె మాజీ ప్రియుడైన కానిస్టేబుల్ మళ్లీ టచ్ లోకి వచ్చాడు. భర్తతో కాపురం చేస్తున్న లేడీ రైంజర్ ఆమె ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కొంతకాలం తరువాత లేడీ రైంజర్ భర్త ప్రమాదంలో చనిపోయాడు. పిల్లలను పుట్టింటిలో అమ్మ దగ్గర వదిలిన లేడీ రైంజర్ ఒంటరిగా ఉంటూ ఉద్యోగం చేస్తూ పోలీసు ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది. కానిస్టేబుల్ అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య పోతేపోయింది అనుకున్న కానిస్టేబుల్ అతని ప్రియురాలితో ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన కానిస్టేబుల్ లేడీ రైంజర్ అయిన తన ప్రియురాలిని చంపేశానని, ఇంట్లో శవం ఉందని చెప్పడంతో పోలీసు అధికారులు హడలిపోయారు.

పోలీసు ఉద్యోగాలకు కోచింగ్
తమిళనాడులోని మదురైలోని సదాశివం ప్రాంతంలో శరణ్య (27) అనే యువతి నివాసం ఉంటున్నది. మదురైలోనిఅనుప్పనదిలో తిరుమురుగన్ (27) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కానిస్టేబుల్ ఉద్యోగాలు సంపాధించాలని మదురైలోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ కు వెలుతున్న సమయంలో శరణ్యచ తిరుమురునగ్ కు పరిచయం అయ్యింది.

పెళ్లికి ముందే ఎంజాయ్
ప్రతిరోజు కోచింగ్ సెంటర్ కు వెలుతున్న శరణ్య, తిరుమురుగన్ కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమలో పడ్డారు. పెళ్లికి ముందే శరణ్య, తిరుమురుగన్ అడ్వాన్స్ గా శారీరకంగా దగ్గర అయ్యారు. పోలీసు ఉద్యోగాలు రాకముందే శారీరక సంబంధం పెట్టుకున్న శరణ్య, తిరుమురుగన్ ఏకాంత ప్రదేశాలకు వెళ్లి పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు.

హ్యాండ్ ఇచ్చిన ప్రియుడు.... ప్రియరాలికి ఇంకా మంచి ఉద్యోగం
శరణ్య ప్రియుడు తిరుమురుగన్ లకు రిజర్వు పోలీసుగా ఉద్యోగం రావడంతో అతని ప్రియురాలికి హ్యాండ్ ఇచ్చి వేరే యువతిని వివాహం చేసుకుని వెళ్లిపోయాడు. కొంతకాలం తరువాత శరణ్యకు తమిళనాడు ఫారెస్టు డిపార్ట్ మెంట్ లో రైంజర్ గా ఉద్యోగం వచ్చింది. కొంతకాలం తరువాత శరణ్య పాన్ పొండి అనే యువకుడిని వివాహం చేసుకుని ఆమె భర్తతో కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది.

లేడీ రైంజర్ అక్రమ సంబంధం
రైంజర్ గా ఉద్యోగం చేస్తున్న మాజీ ప్రియురాలు శరణ్యకు ఆమె మాజీ ప్రియుడైన రిజర్వు కానిస్టేబుల్ తిరుమురుగన్ మళ్లీ టచ్ లోకి వచ్చాడు. భర్త పొన్ పాండితో కాపురం చేస్తున్న లేడీ రైంజర్ శరణ్య ఆమె ప్రియుడు తిరుమురుగన్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఫారెస్టు శాఖలో ఉద్యోగం చేస్తున్న శరణ్య ఎక్కువగా బయట ఉండటంతో ఆమె ప్రియుడు తిరుమురుగన్ కు కలవడానికి ఎక్కువగా చాన్స్ చిక్కింది.

ప్రమాదంలో చనిపోయిన భర్త
మూడు సంవత్సరాల క్రితం లేడీ రైంజర్ శరణ్య భర్త పొన్ పొండి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. భర్త పొన్ పాండి చనిపోయిన తరువాత పిల్లలను మదురైని పుట్టింటిలో అమ్మ దగ్గర వదిలిన లేడీ రైంజర్ శరణ్య తేనీ జిల్లాలోని జోడీ ఫారెస్టు ఏరియాలో రైంజర్ గా ఉద్యోగం చూస్తూ అక్కడే ఇల్లు అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటూ ఉద్యోగం చేస్తున్నది.

పోలీసు మొగుడిని వదిలేసిన భార్య
భర్త పొన్ పాండి చనిపోయి ఒంటరిగా ఉంటున్న మాజీ ప్రియురాలు శరణ్యకు ఇంకా దగ్గర అయిన రిజర్వు పోలీసు తిరుమురుగన్ ఆమె ఇంటికి వెళ్లి ఎంజాయ్ చేశాడు. రిజర్వు కానిస్టేబుల్ తిరుమురుగన్ అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న అతని భార్య గొడవలు పడి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

భార్య లేదని కానిస్టేబుల్ ఇంకా హ్యాపీ
భార్య పోతేపోయింది అనుకున్న రిజర్వు కానిస్టేబుల్ తిరుమురుగన్ అతని ప్రియురాలు శరణ్యతో ఇంకా ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న శరణ్య తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడు తిరుమురుగన్ మీద ఒత్తిడి చేసింది. ఇదే విషయంలో కొంతకాలం నుంచి లేడీ రైంజర్ శరణ్య, రిజర్వు పోలీసు తిరుమురుగన్ మద్య గొడవలు జరుగుతున్నాయని తెలిసింది.

చంపేసి సక్కగా వెళ్లిపోయిన ప్రియుడు
ఇద్దరు పిల్లల తల్లి శరణ్యను పెళ్లి చేసుకోవడానికి ఆమె ప్రియుడు తిరుమురుగన్ వెనుకా ముందు ఆలోచించాడు. ఇదే విషయంలో గొడవలు ఎక్కువ అయ్యాయి. సహనం కోల్పోయిన తిరుమురుగన్ అతని ప్రియురాలు లేడీ రైంజర్ శరణ్యను ఆమె ఇంట్లోనే దారుణంగా చంపేశాడు. మదురైలోని కిరైతురై పోలీస్ స్టేషన్ కు వెళ్లిన కానిస్టేబుల్ తిరుమురుగన్ లేడీ రైంజర్ అయిన తన ప్రియురాలు శరణ్యను చంపేశానని చెప్పాడు.

కూపీలాగుతున్న పోలీసులు
శరణ్య శవం ఆమె ఇంట్లోనే ఉందని చెప్పడంతో పోలీసు అధికారులు హడలిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు శరణ్య ఇంటికి చేరుకుని పరిశీలించి ఆధారాలు సేకరించారు. రిజర్వు పోలీసు తిరుమురుగన్ మీద హత్య కేసు నమోదు చేసి శరణ్య కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications