ఫీవర్, కోల్డ్కి వినియోగించే 156 కాంబినేషన్ డ్రగ్స్పై భారత్ నిషేధం
భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జ్వరం, నొప్పి, జలుబు, అలెర్జీలకు చికిత్స చేయడానికి ఉపయోగించే 156 ఫిక్స్డ్-డోస్ కాంబినేషన్ (FDC) మందులను.. 'మానవులకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది' అని పేర్కొంటూ కేంద్రం నిషేధించింది. ఎఫ్డీసీ ఔషధాలు అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాశీల ఔషధ పదార్ధాల కలయికను స్థిర నిష్పత్తిలో కలిగి ఉంచడం. వీటిని "కాక్టెయిల్" మందులుగా కూడా పేర్కొంటారు.
నిపుణుల కమిటీ, అపెక్స్ ప్యానెల్, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (DTAB).. యాంటీ బాక్టీరియల్ ఔషధాలతో సహా ఈ కలయికలు చికిత్సాపరమైన సమర్థనను కలిగి ఉండవని, మానవ ఆరోగ్యానికి ప్రమాదాన్ని కలిగిస్తున్నాయని కనుగొన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఆగస్ట్ 12న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. నిషేధిత ఔషధాలలో 'అసెక్లోఫెనాక్ 50ఎంజీ + పారాసెటమాల్ 125ఎంజీ టాబ్లెట్', మెఫెనామిక్ యాసిడ్ + పారాసెటమాల్ ఇంజెక్షన్, సెటిరిజైన్ హెచ్సిఎల్ + పారాసెటమాల్ + ఫినైల్ఫ్రైన్ హెచ్సిఎల్, లెవోసిలిప్రైన్ + ప్లోసెటిరిజైన్ + పారాసెటమాల్ + క్లోర్ఫెనిరమైన్ మలేట్ + ఫినైల్ ప్రొపనోలమైన్, కామిలోఫిన్ డైహైడ్రోక్లోరైడ్ 25 ఎంజీ + పారాసెటమాల్ 300ఎంజీ వంటి ప్రముఖ కాంబినేషన్లు ఉన్నాయి.
అంతేగాక, పారాసెటమాల్, ట్రామడాల్, టౌరిన్, కెఫిన్ కలయిక కూడా నిషేధించారు. ఎందుకంటే ఇది ట్రామడాల్ ఓపియాయిడ్ ఆధారిత నొప్పి నివారిణి. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940లోని సెక్షన్ 26A కింద నిషేధం జారీ చేశారు. హానికరం లేదా అనవసరమైనదిగా భావించే ఔషధాల తయారీ, అమ్మకం, పంపిణీని నిషేధించడానికి ఇది ప్రభుత్వానికి అనుమతిస్తుంది.
ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్ని ఉపయోగించడం వల్ల మనుషులకు ప్రమాదం పొంచి ఉందని, అయితే ఈ డ్రగ్కు సురక్షితమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం సంతృప్తి చెందిందని నోటిఫికేషన్ పేర్కొంది. ఈ ఎఫ్డిసిలను "అహేతుకం"గా పరిగణించిన కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ ఈ విషయాన్ని పరిశీలించిందని తెలిపింది. రోగుల సురక్షితం కోసం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
'ఎఫ్డీసీ మానవులకు ప్రమాదం కలిగించవచ్చు. అందువల్ల, భారీ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940లోని సెక్షన్ 26 A ప్రకారం ఈ FDC తయారీ, అమ్మకం లేదా పంపిణీని నిషేధించడం అవసరం" అని నోటిఫికేషన్ పేర్కొంది. పైన ఉన్న దృష్ట్యా, రోగులలో ఏదైనా ఉపయోగం కోసం అనుమతించే ఎలాంటి నియంత్రణ లేదా పరిమితి సమర్థనీయం కాదు. కాబట్టి, సెక్షన్ 26A కింద నిషేధం మాత్రమే సిఫార్సు చేయబడింది" అని స్పష్టం చేసింది.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications