ఇథియోపియా విమాన ప్రమాదం ఎఫెక్ట్: భారత్లో తక్షణమే బోయింగ్ 737 విమానాలకు బ్రేక్
ఢిల్లీ: ఇథియోపియాలో బోయింగ్ 737 మ్యాక్స్ 8 జంబో విమానం కూలి 157 మంది మృతి చెందడంతో అలర్ట్ అయ్యింది భారత పౌరవిమానాయాన శాఖ. బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక అంతకుముందు ఈ మోడల్ విమానంను నడిపేవారికి అదనంగా కొన్ని సూచనలు చేసింది. ఆ తర్వాత రిస్క్ చేయకూడదని భావించి ఎట్టకేలకు విమానాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఈ విమానాల్లో సాంకేతికంగా అన్ని మరమత్తులు జరిగాకే తిరిగి గాల్లోకి ఎగురుతాయని పౌరవిమానాయానశాఖ తెలిపింది.

ప్రయాణికుల క్షేమం కంటే తమకేది ఎక్కువకాదని చెప్పిన పౌరవిమానాయాన సంస్థ ఈ మేరకు ఇతర దేశాలు, విమాన తయారీ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని డీజీసీఏ వెల్లడించింది. ఇక భారత్లో స్పైస్ జెట్, జెట్ ఎయిర్వేస్ సంస్థలు బోయింగ్ 737 మ్యాక్స్ 8 మోడల్ విమానాలను నడుపుతున్నాయి. స్పైస్ జెట్ 12 విమానాలను నడుపుతుండగా... జెట్ ఎయిర్వేస్ విమానాయాన సంస్థ 5 విమానాలను నడుపుతోంది. జెట్ఎయిర్వేస్కు ఆర్థిక కష్టాలు వచ్చినందున ఈ విమానాలను ఇప్పటికే నిలిపివేయగా... స్పైస్ జెట్ మాత్రం ఇంకా ఈ విమానాలను నడుపుతోంది.
DGCA has taken the decision to ground the Boeing 737-MAX planes immediately. These planes will be grounded till appropriate modifications and safety measures are undertaken to ensure their safe operations. (1/2)
— Ministry of Civil Aviation (@MoCA_GoI) March 12, 2019
ఇదిలా ఉంటే స్పైస్ జెట్ మాత్రం ఈ బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానాల పనితీరు బాగానే ఉందని చెబుతోంది. ఇప్పటి వరకు కొన్ని వేలమంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చాయని ఎప్పుడూ ఇబ్బందులు తలెత్తలేదని స్పైస్ జెట్ ఎయిర్వేస్ సంస్థ వెల్లడించింది. ఇదిలా ఉంటే భారత్ కంటే ముందు చాలా దేశాలు ఈ తరహా మోడల్ విమానాలను నిషేధించాయి. ఇప్పటికే ఈ తరహా మోడల్కు ఇథియోపియన్ ఎయిర్లైన్స్, లయన్ ఎయిర్ ఫ్లైట్ విమానాలు కూలిపోవడంతో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.మార్చి 12న బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు కూడా ఈ మోడల్ విమానాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.
ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ట్వీట్ చేశారు. విమానాలను మానవుడు నడపడం చాలా కష్టతరం అవుతోందని వ్యాఖ్యానించారు.ఇక విమానాలను నడిపేందుకు పైలట్లు అక్కర్లేదని చెప్పిన ఆయన ... ప్రముఖ యూనివర్శిటీ మసుచుషెట్స్కు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్తలు నడపగలరని అన్నారు. ఇదిలా ఉంటే బోయింగ్ విమానాల తయారీపై సస్పెన్స్ మెయింటెయిన్ చేస్తూ వస్తోంది యాజమాన్యం. విమానాల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని అవి ఎగిరేందుకు సురక్షితంగానే ఉన్నాయని చెబుతోంది.
-
అనసూయకు అవమానం..? వీడియో -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
మనకు మరో వందేభారత్, రెండు అమృత్ భారత్ ఖరారు- ఇక 3 గంటల్లోనే, రూట్..!! -
ఇక సెలవ్.. బీహార్ లో ముగిసిన నితీష్ శకం..!! -
వాంఖెడే ఈ నలుగురికీ కొట్టిన పిండే: అయినా డేంజర్- అచ్చిరాని పిచ్ -
Ind Vs Eng:సెమీస్ వేళ బ్యాటింగ్ లో మార్పులు, గంభీర్ కొత్త లెక్కలు - సెంటిమెంట్..!! -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో అద్దిరిపోయే రైల్వే స్టేషన్- ఆ జిల్లాకు బెటర్ కనెక్టివిటీ -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
T20 World Cup:సెమీస్ వేళ పఠాన్ కీలక సూచన-సౌతాఫ్రికాను కొట్టిన కివీస్ ప్లాన్..! -
నాగ చైతన్య నెవర్ బిఫోర్ అవతార్.. కేరీర్ బిగ్టెస్ట్ హిట్ ప్రామిస్












Click it and Unblock the Notifications