‘ఆధార్’పై మూడీస్ ఆరోపణలపై ఘాటుగా స్పందించిన కేంద్రం, యూఐడీఏఐ
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఎలాంటి సేవలు పొందాలన్నా.. ఇతర ముఖ్యమైన సేవలకు ఇప్పుడు ఆధార్ తప్పనిసరి అయిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆధార్పై ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సంచలన ఆరోపణలు చేసింది. ఆధార్ వల్ల గోప్యత, భద్రతా ముప్పు పొంచివుందని, అన్ని వేళలా దాన్ని ఉపయోగించడం విశ్వసనీయం కాదని పేర్కొంది.
అధిక ఉష్ణోగ్రత, చెమటలు ఎక్కువగా పట్టే దేశంలో బయోమెట్రిక్ టెక్నాలజీని నమ్ముకోవడం సరికాదని తెలిపింది. అయితే, ఈ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) గట్టిగా తిప్పికొట్టింది. అవన్నీ నిరాధారమని కొట్టిపారేసింది.

ఆధార్ అనేది భారతదేశంలో అంతర్గత వ్యవస్థ అని.. ఆధార్ అనేది ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన డిజిటల్ ఐడీ అని స్పష్టం చేసింది. ప్రాథమిక లేదా ద్వితీయ డేటా లేదా పరిశోధన అని తెలపకుండా నివేదికను తయారు చేసి నిరాధార ఆరోపణలు చేశారంటూ మూడీస్పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఒక నిర్దిష్ట పెట్టుబడిదారుల సేవ, ఎటువంటి ఆధారాలు లేదా ఆధారం లేకుండా.. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన డిజిటల్ ఐడీ అయిన ఆధార్కు వ్యతిరేకంగా విస్తృతమైన వాదనలు చేసిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అసహనం వ్యక్తం చేసింది.
గత దశాబ్దంలో ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది భారతీయులు ఆధార్పై తమ విశ్వాసాన్ని ఉంచారని.. 100 బిలియన్ల కంటే ఎక్కువ సార్లు తమను తాము ప్రమాణీకరించుకోవడం ద్వారా దీన్ని ఉపయోగించారని తెలిపింది. గుర్తింపు వ్యవస్థలో ఇంత అపూర్వమైన విశ్వాస ఓటును విస్మరించడం అంటే వినియోగదారులు వారి స్వంత ప్రయోజనాలను అర్థం చేసుకోలేరని అర్థం. వారి స్వంత ప్రయోజనం కోసం అభియోగాలు మోపారు అని మూడీస్పై ఘాటుగా స్పందించింది.
అంతేగాక, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(IMF), ప్రపంచ బ్యాంక్ వంటి ప్రపంచ సంస్థలు ఆధార్ను ప్రశంసించాయని, ఇలాంటి డిజిటల్ ఐడీ వ్యవస్థలను ఎలా అమలు చేయాలో అర్థం చేసుకోవడానికి అనేక దేశాలు యూఐడీఏఐని సంప్రదించాయని కేంద్ర ప్రభుత్వం వివరించింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications