Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2024 కల్లా చైనాను దాటనున్న భారత్ జనాభా, ఆ తర్వాత..

2024 నాటికి భారత జనాభా చైనాను మించిపోతుందని ఐక్య రాజ్య సమితి అంచనా వేసింది. ఐరాస 'ప్రపంచ జనాభా భావి అంచనాలు: 2017 సవరణ' పేరుతో ఓ నివేదికను వెలువరించింది.

న్యూఢిల్లీ: 2024 నాటికి భారత జనాభా చైనాను మించిపోతుందని ఐక్య రాజ్య సమితి అంచనా వేసింది. ఐరాస 'ప్రపంచ జనాభా భావి అంచనాలు: 2017 సవరణ' పేరుతో ఓ నివేదికను వెలువరించింది.

2030 నాటికి భారత జనాభా 150 కోట్లకు చేరుతుందని అంచనా. చైనా ప్రస్తుత జనాభా 141 కోట్లు. భారత ప్రస్తుత జనాభా 134 కోట్లుగా ఉంది. ఏడేళ్లలో చైనా జనాభాను మించుతామని పేర్కొంది.

India to overtake China's population by 2024: UN

ప్రపంచ జనాభాలో ఇప్పుడు చైనా జనాభా శాతం 19గా, భారత్ జనాభా శాతం 18గా ఉంది. అంతకుముందు 2015లో ఐరాస అంచనా ప్రకారం.. చైనా జనాభాను భారత్ 2022 కల్లా అధిగమిస్తోందని పేర్కొంది.

2015లో 24వ ఐక్య రాజ్య సమితి అధికారుల పాపులేషన్ ఎస్టిమేట్స్ అండ్ ప్రొజెక్షన్ భేటీ అయినప్పుడు 2022 కల్లా భారత్.. చైనాను అధిగమిస్తుందని పేర్కొంది. ఇప్పుడు 25వ రౌండ్ సమావేశంలో 2024 వరకు దాటుతుందని పేర్కొంది.

జనాభా అంచనాకు సంబంధించిన వివరాలను బుధవారం నాడు విడుదల చేశారు. దీని ప్రకారం 2024 కల్లా భారత్, చైనా దేశాల జనాభా 1.44 బిలియన్లుగా ఉంటుంది. అప్పటికే చైనా జనాభాను మించుతుంది. అనంతరం 2030 కల్లా 150 కోట్లకు చేరుకుంటుంది.

2050లో 166 కోట్లుగా భారత్ జనాభా ఉంటుందని తెలిపింది. అదే సమయంలో చైనా జనాభా 2024 వరకు కూడా దాదాపు అంతే ఉంటుందని అంచనా వేశారు.

ఆ తర్వాత 2100 కల్లా భారత్ జనాభా 151 కోట్లకు చేరుకుంటుందని ఐరాస అంచనా వేసింది. అంటే 2050 నుంచి 2100 వరకు అంటే అర్ధ శతాబ్దంలో భారత్ జనాభా తక్కువగానే పెరుగుతుంది. కానీ 2100 నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా భారత్ ఉంటుంది.

ఈ రిపోర్టు ప్రకారం 2050 నాటికి నైజీరియా జనాభా అమెరికాను మించిపోనుంది. దీనితోపాటు నైజీరియా జనాభా విషయంలో ప్రపంచంలోనే మూడవ స్థానాన్నిఆక్రమించనుంది.

ఇక భారత్ విషయానికొస్తే 2050 నాటికి భారత్‌లో 60 సంవత్సరాల వయసు పైబడినవారి సంఖ్య రెండింతలవుతుందని పేర్కొంది.

ప్రస్తుతం దేశంలో 60 సంవత్సరాలు దాటిన వారి సంఖ్య సుమారు 14 కోట్లు ఉంది. ప్రసుత భారత జనాభా 134 కోట్లు. చైనా జనాభా 141 కోట్లు ప్రతి ఏటా ప్రపంచ జనాభా 8.3 కోట్ల చొప్పున పెరుగుతున్నట్లు ఒక అంచనా. ఈ నేపథ్యంలో ఆహార ఉత్పత్తుల కొరత ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది.

2025-2030 మధ్య భారత దేశంలో సగటు వ్యక్తి జీవిత కాలం 71 ఏళ్లుగా, 2045-2050 మధ్య 74.2గా ఉంటుందని అంచనా వశారు.ప్రస్తుతం ప్రపంచ జనాభా 760 కోట్లుగా ఉంది. 2030 నాటికి 860 కోట్లు, 2050 నాటికి 980 కోట్లు, 2100 నాటికి 1120 కోట్లుగా ఉంటుందని అంచనా.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+