ప్రపంచ బ్యాంకు నుంచి అత్యధికంగా అప్పు తీసుకున్న ఇండియా
న్యూఢిల్లీ : వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పథకాల కోసం ప్రపంచ బ్యాంకు అప్పు ఇస్తుంటుంది. ఇందుకు సంబంధిత నియమాలు, నిబంధనలు ఉంటాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియా .. ప్రపంచ బ్యాంకు నుంచి అత్యధికంగా అప్పు తీసుకుంటుంది. గత పదేళ్ల నుంచి ప్రపంచ బ్యాంకు భారతదేశం తీసుకునే అప్పు పెరుగుతూనే ఉంది. గత నాలుగేళ్లలోనే 5 బిలియన్ డాలర్ల రుణం తీసుకుంది ఇండియా.

కీలక రంగాలకు కేటాయింపు
2009 నుంచి తీసుకుంటోన్న రుణం ఏటేటా పెరుగుతోంది. ఈ రుణంతో కీలక రంగాలపై ఖర్చుచేస్తోంది. అయితే 2010 తర్వాత ప్రపంచబ్యాంకు అన్నిదేశాలకు ఇచ్చే రుణాన్ని తగ్గిస్తోంది. 2010 ఆర్థికమాంద్యం ఏర్పడటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక వరల్డ్ బ్యాంక్ నుంచి ఇండియా తీసుకున్న రుణం ద్వారా రహదారుల అభివృద్ధి, విద్యుత్, మౌలిక వసతుల సదుపాయాల కల్పన, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, విపత్తుల నిర్వహణశాఖ కోసం ఖర్చు చేస్తోంది.
ఆర్థికమాంద్యంతో తగ్గిన రుణం
2010లో ఇండియా 9.3 బిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. ఆర్థికమాంద్యం ఏర్పడటంతో ఆ మరుసటి ఏడాది నుంచి రుణం ఒక్కసారిగా తగ్గిపోయింది. కీలక రంగాలకే నిధులు కేటాయించాలని భారతదేశానికి ప్రపంచ బ్యాంకు స్పష్టంచేసింది. ఏటేటా రుణ విలువ కూడా తగ్గిస్తూ వస్తోంది. అలాగే ఒడిశా - ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన తుపాను సాయం కింద రుణం అందజేసిందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు తెలిపారు.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications