దుబాయ్లో మోడీ ప్రసంగం, 48వేలమంది రిజిస్ట్రేషన్
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటన వివరాలను తెలిపారు. ఈ నెల 16, 17 తేదీల్లో యూఏఈలో పర్యటించనున్నారు. 17వ తేదీన దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
ఇందుకోసం ఇప్పటికే దాదాపు నలభై ఎనిమిది వేల మందికి పైగా భారతీయులు పేర్లు నమోదు చేసుకున్నారు. సభ నాటికి ఈ సంఖ్య యాభై వేలకు చేరవచ్చునని భావిస్తున్నారు.
స్టేడియం సామర్థ్యం 30వేలు మాత్రమే. అయితే, నలభై వేల మందికి మోడీ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మైదానంలో కూడా ఏర్పాట్లు చేసి వచ్చిన వారందరికీ తగిన సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులు భావిస్తున్నారు.
ఓపెన్ ఎయిర్ స్టేడియం కావడంతో సందర్శకులు 43 డిగ్రీల ఎండతో ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్టేడియాన్ని కూల్గా చేసేందుకు ఒక రోజు ముందుగానే అత్యాధునిక ఏసీలు ఉంచి, వాటిని ఆన్ చేయనున్నారు. ఆహారం ఉచితంగా అందిస్తారు.