'ఇండియన్స్ యూకే తప్ప అన్ని దేశాలకు వెళ్తున్నారు, భారతీయులు ఉద్యోగ సృష్టికర్తలు'
లండన్: యువత సాధికారత, యంగ్ లీడర్స్ రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపర్చేందుకు ఎలా సహాయపడతారు అనే అంశంపై యంగ్ లీడర్స్ ఫోరమ్ సమావేశంలో గురువారం చర్చించారు. అలాగే సాంస్కృతిక అవగాహన పెంపొందించే అంశంపై చర్చించారు.
యున నేతలతో భేటీ సందర్భంగా ఓలా స్ట్రాటెజిక్ ఇనిషియేటివ్ హెడ్ ఆనంద్ షా మాట్లాడారు. మీ అనుభవం ఆధారంగా గుర్తింపు ఉండాలని చెప్పారు. మీ వృత్తి ఏదైనప్పటికీ అది మీకు పవర్ దిశగా ముందుకు తీసుకు వెళ్తుందన్నారు. ఎవరైనా తాము పట్టిన మాతృభూమితో పాటు స్థిరపడిన భూమిని కూడా ప్రేమించాలని, రెండు దేశాలపై ప్రేమ ఉండాలన్నారు. ఇండియన్స్ను ఉద్దేశించి మాట్లాడుతూ.. మనలో ప్రతి ఒక్కరు సగం బ్రిటన్, సగం ఇండియన్ గుర్తింపు కలిగి ఉన్నామన్నారు.

35 ఏళ్ల వయస్సులోపు గల యంగ్ ఎంటర్ప్రెన్యూయర్స్, ప్రొపెషనల్స్, పబ్లిక్ సెక్టార్ లీడర్లను ఉద్దేశించి కంబోడియాలోని ఇండియన్ హై కమిషనర్ దినేష్ కే పట్నాయక్ మాట్లాడారు. ఇండియన్స్ అంతా యాక్టివ్గా ఉండాలని, అందరిదీ ఒకే గొంతు కావాలన్నారు. మనలోని రాజకీయ నాయకులు కూడా దీనిని గ్రహించాలన్నారు.
యూకే ఇండియా కాన్క్లేవ్లో లాంచ్ చేసిన టెక్ ఎక్స్చేంజ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
దినేష్ ఓ గదిలో రాజకీయ పార్టీ మెంబర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ విద్యార్థులు అంతటికీ వెళ్తున్నారని, కానీ యూకేకు మాత్రం ఎక్కువగా వెళ్లడం లేదన్నారు. యూకే యూనివర్సిటీలలో భారతీయ విద్యార్థులు తక్కువగా ఉన్నారని ఆయన చెప్పారు. అన్ని దేశాల విద్యార్థుల మొబిలిటీ బాగా ఉండాలన్నారు.
భారతీయ విద్యార్థులు చదువుకునేందుకు యూకే వస్తున్నారని, బ్రిటన్ స్టూటెండ్స్ ఇండియాకు రావడం లేదన్నారు. 95 శాతం లేదా ఎంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు తిరిగి ఇండియా వెళ్లే వీసా కలిగి ఉన్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఇండియా ఇంక్ సీఈవో మనోజ్ లాడ్వా మాట్లాడారు. ఈ సమావేశం ద్వారా మనం భారతీయులు ఉద్యోగాలు సృష్టించే వారు కానీ ఉద్యోగాలు తీసుకెళ్లేవారు కాదనే బలమైన నినాదం ఇచ్చామన్నారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications