Flight Tickets: విమాన టికెట్లపై కేంద్రం కీలక నిర్ణయం..! ఎయిర్ లైన్స్ కు షాక్..!
ఇండిగో సంక్షోభం సమయంలో ప్రయాణీకులను రక్షించడానికి విపరీతంగా పెరిగిన విమాన ఛార్జీలను పరిమితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఇండిగో ఎయిర్ లైన్స్ లో ఏర్పడిన సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంటున్న ఇతర విమానయాన సంస్థలకు కేంద్రం ఇవాళ షాకిచ్చింది. ఇండిగో ఎయిర్ లైన్స్ రోజూ వందలాది విమానాలు రద్దు చేస్తుండటం, ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్న నేపథ్యంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో ఇండిగో ప్రయాణికుల్ని ఆకర్షించేందుకు ఇతర ఎయిర్ లైన్స్ రంగంలోకి దిగాయి.
రోజుల తరబడి ఇండిగో విమానాల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు ఇక చేసేది లేక ఇతర ఎయిర్ లైన్స్ ను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇండిగోతో పోలిస్తే తక్కువ విమానాలు కలిగిన ఇతర సంస్థలకు మంచి అవకాశం దొరికినట్లయింది. దీన్ని వాడుకునేందుకు వెంటనే రంగంలోకి దిగిపోయిన ఆయా ఎయిర్ లైన్స్.. ప్రయాణికులను బాదేస్తున్నాయి. టికెట్ల రేట్లను అసాధారణంగా పెంచేస్తున్నాయి. దీంతో ఇప్పటికే ఇండిగో సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమైన కేంద్రం మరింత ఇరుకునపడుతోంది.

ఈ నేపథ్యంలో కేంద్రం ఇవాళ రంగంలోకి దిగింది. ఇండిగో సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుంటున్న ఇతర ఎయిర్ లైన్ సంస్థలపై కొరడా ఝళిపించాలని నిర్ణయించింది. ఇతర ఎయిర్ లైన్ సంస్థల అవకాశవాదాన్ని తప్పుబడుతూ టికెట్ రేట్లను పెంచితే ఊరుకునేది లేదని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని ఎయిర్ లైన్ సంస్థలకూ ఆదేశాలు పంపింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తోంది.
ఎయిర్ లైన్స్ (Airlines) అసాధారణంగా ఎక్కువ విమాన ఛార్జీలు విధించడాన్ని తీవ్రంగా పరిగణించినట్లు మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. అవకాశవాద ధరల నుండి ప్రయాణీకులను రక్షించడానికి, ప్రభావితమైన అన్ని మార్గాలలో న్యాయమైన , సహేతుకమైన ఛార్జీలను నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ తన నియంత్రణ అధికారాలను ఉపయోగించుకుందని తెలిపింది. ఇండిగో కార్యకలాపాలు స్థిరీకరించబడే వరకు కొత్తగా సూచించిన పరిమితులను ఖచ్చితంగా పాటించాలని అన్ని విమానయాన సంస్థలకు సూచించింది.

ఇండిగో విమానాల వరుస రద్దు నేపథ్యంలో సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు , వైద్య ప్రయాణీకులు సహా వేలాది మంది సీట్లు పొందడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో ధరల పెంపును అడ్డుకోవడానికి, దోపిడీని నిరోధించడానికి ఈ చర్య అవసరమని భావించినట్లు కేంద్రం తమ ప్రకటనలో తెలిపింది. ఛార్జీల స్థాయిలపై ఈ మేరకు నిఘా పెడుతున్నట్లు పేర్కొంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications