ఆ బ్యాంకులో 120 కోట్లు డిపాజిట్లు, నల్లధనమని ఐ.టి. శాఖ అనుమానం
డిల్లీలోని జైన్ కో ఆపరేటివ్ బ్యాంకులో 120 కోట్లు డిపాజిట్లు అయ్యాయి,పెద్ద నగదునోట్ల రద్దు తర్వాత ఈ నగదును డిపాజిట్ చేశారు.అయితే ఈ నగదును నల్లధనంగా పోలీసులు అనుమానిస్తున్నారు.
న్యూఢిల్లీ :పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత ప్రైవేట్ , ప్రభుత్వ బ్యాంకుల్లో అక్రమంగా నల్లధనాన్ని మార్పిడిచేసుకొనేందుకుగాను అక్రమార్కులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీలోని జైన్ కోఆపరేటిట్ బ్యాంకులో సుమారు 120 కోట్ల నగదు డిపాజిట్లను ఆదాయపు పన్నుశాఖ అధికారులు గుర్తించారు. ఈ నగదు నల్లధనంగా ఐటిశాఖ అధికారులు అనుమానిస్తున్నారు.
ఆధాయపు పన్నుశాఖకు చెందిన డిల్లీశాఖాధికారులు డిల్లీలోని జైన్ బ్యాంకు బ్రాంచ్ లో దాడులు చేసి షాక్ గురయ్యారు. నల్లధనం ఈ బ్యాంకులో 120 కోట్లు డిపాజిట్ చేశారని అధికారులు అనుమానిస్తున్నారు.

ఢిల్లీలోని జైన్ కో ఆపరేటివ్ బ్యాంకులోని లావాదేవీలపై ఐదురోజులుగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నల్లధనం ఉన్నట్టు గుర్తించారు.పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత ఈ బ్యాంకులో పెద్ద ఎత్తున నగదు జమ కావడంతో అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈ నగదును ఎవరెవరు ఎప్పుడు డిపాజిట్ చేశారు. వారికి ఈ నగదు ఎక్కడి నుండి వచ్చిందనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. నల్లధనాన్ని మార్పిడిచేసుకొనేందుకుగాను అక్రమార్కులు బ్యాంకులను ఉపయోగించుకొంటున్నారని ఆదాయపు పన్నుశాఖాధికారులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications