20 ఏళ్ల తర్వాత.. మళ్లీ ఓటేసిన మణిపూర్ ఉక్కుమహిళ
మణిపూర్ ఉక్కుమహిళ ఇరోమ్ చాను షర్మిల ఇరవై ఏళ్ల తరువాత మళ్లీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇంఫాల్: మణిపూర్ ఉక్కుమహిళ ఇరోమ్ చాను షర్మిల ఇరవై ఏళ్ల తరువాత మళ్లీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో షర్మిల ఇటీవలే రాజకీయ ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.
ఆరోజు మణిపూర్ అసెంబ్లీకి తొలి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 60 సీట్లలో ఈరోజు 38 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ పోరాట యోధురాలు.. తాను స్థాపించిన పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయన్స్(పీఆర్జేయే) పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థలను బరిలో ఉంచారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని.. మణిపూర్ లో అలాంటి మార్పు తీసుకురాగలమని ఆమె పేర్కొన్నారు.

యువతరం నుంచి కూడా సానుకూల స్పందన వస్తోందని, మార్చి 8 జరిగే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న ఖంగాబాక్ నియోజకవర్గంలో తాము విజయం సాధించి తీరుతామన్నారు.
పౌరహక్కుల కార్యకర్తగా నిరంతర పోరాటం సాగిస్తున్న షర్మిల 2000 సంవత్సరం నవంబర్ 2న నిరాహార దీక్ష ప్రారంభించి పదహారేళ్ల పాటు కొనసాగించారు. ఎలాంటి ఆహారం, నీరు తీసుకోకుండా 500 వారాలపాటు సుదీర్ఘ నిరాహార దీక్ష చేసిన ఉద్యమకారణిగా చరిత్ర సృష్టించారు. ఎట్టకేలకు గత ఏడాది ఆగస్టు 9న నిరాహార దీక్ష విరమించిన షర్మిల రాజకీయ పార్టీని స్థాపించి మరో పోరాటానికి సిద్ధమయ్యారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications