వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ న్యాయమూర్తి మృతి అంశం తీవ్రమైనది: సుప్రీం కోర్టు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు విచారించిన సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి బీహెచ్ లోయ అనుమానాస్పదస్థితిలో మూడేళ్ల క్రితం మృతి చెందారు. ఈ ఆంశాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆ జడ్జి మృతిని తీవ్రమైన అంశంగా పేర్కొంది.

సుప్రీంలో అవాంఛనీయ సంఘటనలు, చీఫ్ జస్టిస్ వినలేదు: చరిత్రలో తొలిసారి 4గురు జడ్జిల ప్రెస్‌మీట్సుప్రీంలో అవాంఛనీయ సంఘటనలు, చీఫ్ జస్టిస్ వినలేదు: చరిత్రలో తొలిసారి 4గురు జడ్జిల ప్రెస్‌మీట్

ఈ కేసులో స్వతంత్ర విచారణ దర్యాఫ్తు చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు సమాధానం ఇవ్వాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసింది.

చీఫ్ జస్టిస్‌పై సుప్రీం జడ్జిల సంచలనం, రంగంలోకి ప్రధాని మోడీ!చీఫ్ జస్టిస్‌పై సుప్రీం జడ్జిల సంచలనం, రంగంలోకి ప్రధాని మోడీ!

 సహచరుడి కుమార్తె వివాహానికి వెళ్లి వస్తుండగా

సహచరుడి కుమార్తె వివాహానికి వెళ్లి వస్తుండగా

తన సహచరుడి కుమార్తె వివాహానికి హాజరైన బీహెచ్ లోయ 2014 డిసెంబర్ 1న నాగపూర్‌లో గుండెపోటుతో మృతి చెందారు. ఈ మృతి మిస్టరీగా మారింది. మిస్టరీగా మారిన ఈ కేసులో స్వతంత్ర దర్యాఫ్తు అవసరం అని చెబుతూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ అరుణ్ మిశ్ర, జస్టిస్ ఎంఎం శాంతాగౌడర్‌తో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీని విచారణ చేపట్టింది.

 బీహెచ్ లోయ మృతికి పోస్టుమార్టం నివేదిక

బీహెచ్ లోయ మృతికి పోస్టుమార్టం నివేదిక

బీహెచ్ లోయ మృతికి సంబంధించిన పోస్టుమార్టం నివేదికతో పాటు సంబంధించిన పత్రాలను దాఖలు చేయాలని మహా ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదికి సూచనలు చేసింది. అనంతరం తదుపరి విచారణ ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది.

విచారణపై ఇలా

విచారణపై ఇలా

కాగా, అంతకుముందు బాంబే లాయర్స్ అసోసియేషన్ తరఫున హాజరైన సీనియర్ లాయర్ తన వాదనలు వినిపించారు. ప్రస్తుతం ఈ అంశం బాంబే హైకోర్టు పరిధిలో ఉన్నందువల్ల ఈ పిటిషన్‌ను విచారించకపోవడం మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

విచారణ జరగాలని

విచారణ జరగాలని

మహారాష్ట్రకు చెందిన పిటిషనర్లలో ఒకరైన జర్నలిస్ట్ బీఆర్ లోన్ తరఫున హాజరైన సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కేసులో మరో పిటిషనర్ అయిన కాంగ్రెస్ నేత తెహసేన్ పూనావాలా తరఫున హాజరైన వీరేంద్ర కుమార్ శర్మ వాదనలు వినిపిస్తూ లాయర్ మృతి కేసులో విచారణ జరగాలన్నారు.

English summary
The Supreme Court today termed as a "serious matter" the issue of alleged mysterious death of special CBI judge B H Loya, who was hearing the Sohrabuddin Sheikh encounter case, and sought response from Maharashtra government on pleas seeking an independent probe into it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X