కశ్మీర్ లో ఎన్ కౌంటర్ : ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతాదళాలు
శ్రీనగర్ : పాకిస్థాన్ లో వైమానిక దాడుదల తర్వాత సరిహద్దులో పాక్ మూకలు రెచ్చిపోతున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి యధేచ్చగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. పాకిస్థాన్ చేస్తున్న దాడులను భారత భద్రతాదళం ధీటుగా తిప్పికొడుతోంది.
ఉగ్రవాది హతం
కశ్మీర్ లోని కుప్వారా జిల్లా హంద్వారాలోని క్రల్ గండ్ ప్రాంతంలో గురువారం ఉదయం భద్రతాదళాలు, పాకిస్థాన్ మూకలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. జవాన్లు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టారు. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.

కుప్వారా, హంద్వారాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
కాల్పులు జరిపిన సమీప ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది సోదాలు కొనసాగుతోన్నాయి. ఇటు కుప్వారా, హంద్వారాలో ముందుజాగ్రత్త చర్యగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ముష్కరుడి హతంతో ఉగ్ర వాద సంస్థలు సమాచారం చెరవేసి .. అల్లర్లు జరిపేందుకు కుట్రపన్నుతాయనే కారణంతో ఇంటర్నెట్ ను ఆపివేసినట్టు భద్రతా సిబ్బంది పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications