వైరల్ వీడియో: బెంగళూరు జైలులో షాకింగ్.. ఫోన్ మాట్లాడుతూ, టీవీలు చూస్తున్న ఖైదీలు..!
సాధారణంగా జైలులో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. కరుడుగట్టిన నేరస్థులు, ఉగ్రవాదులు, రేపిస్టులకైతే ప్రత్యేక సెల్ ఉంటుంది. వీరికి అప్పటికే కోర్టులు కఠిన కారాగార శిక్ష విధించిన నేపథ్యంలో వీరికోసం ప్రత్యేకమైన భద్రత ఉంటుంది. అయితే తాజాగా బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఖైదీలు నిబంధనలకు విరుద్ధంగా సరదాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తేలింది. ఖైదీల చేతిలో మొబైల్ ఫోన్ లు ఉండటంతోపాటు మరికొంతమంది ఖైదీలు టీవీ చూస్తున్న దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వీరిలో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు కూడా ఉండటంతో సర్వాత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.
Indian Jails are neglected sector of the government with no training, lack of infrastructure and primarily focused on reformation not meant to house dangerous terrorists and hardened criminals. Having served as DGP of Prisons in J&K, both Central and State Governments needs to go… https://t.co/dVjnVC5mUn
— Shesh Paul Vaid (@spvaid) November 9, 2025
బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో భద్రతా లోపం స్పష్టంగా కనబడుతోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఐఎస్ఐఎస్ రిక్రూటర్ జుహాబ్ హమీద్ షకీల్ మన్నా.. జైలులోనే మొబైల్ ఫోన్ వినియోగించడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దృష్టికి వెళ్లడంతో ఈ విషయంపై దర్యాప్తుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జైలు సూపరింటెండ్ తో పాటు ఐదుగురు జైలు అధికారులను సస్పెండ్ చేశారు.

ఇక నవంబర్ 8 న పోస్టు చేసిన ఈ వీడియోలో మన్నా అలియాస్ జుహాబ్ హమీద్ షకీల్ దర్జాగా ఫోన్ వాడుతున్నట్లు దృశ్యాలు కనిపించాయి. అతడు 2018 నుంచి జైలులో ఉన్నాడు. ఇక ఇదే జైలులో వివిధ నేరాల్లో శిక్షలు పడిన ఖైదీలు, రేపిస్టులు, నేరస్థులు మొబైల్ ఫోన్ లలో మాట్లాడూతూ.. టీవీలు చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో బయటపడిన ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. సీఎం సిద్ధరామయ్య ఆదేశాల మేరకు ఐదుగురు జైలు అధికారులను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తునకు కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications