జమ్మూ కాశ్మీర్ వరదలు లేటెస్ట్ అప్ డేట్స్ (పిక్చర్స్)
న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన జమ్మూ కాశ్మీర్ జనజీవనం నెమ్మదిగా తేరుకుంటుంది. వరదనీరు క్రమంగా తగ్గడంతో అక్కడి ప్రజలు ఇప్పుడిప్పుడే ఇళ్ల నుండి బయటకు వస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారిని రాకపోకల కోసం మంగళవారం తెరిచారు.
సెప్టెంబర్ 7 నుంచి జమ్మూ కాశ్మర్ని భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. దీంతో సహాయ చర్యలు 15వ రోజుకి చేరుకున్నాయి. వరదల కారణంగా తప్పిపోయిన వారికోసం అక్కడి ప్రభుత్వం నిరంతరం సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
శ్రీనగర్లోని జవహార్ నగర్ ప్రాంతంలో మంగళవారం 13 మృతదేహాలను వెలికితీశారు. దీంతో వరదల్లో చనిపోయిన వారి సంఖ్య 200కు చేరింది. మరోవైపు వరద నీటిని తోడివేసే కార్యక్రమం కోనసాగుతూనే ఉంది. గత 60 ఏళ్లలో ఇంతటి భయంకరమైన వరదలను తామెన్నడూ చూడలేదని అన్నారు.
జమ్మూ కాశ్మీర్ వరదలు లేటెస్ట్ అప్ డేట్స్
పూంచ్లో ఏర్పాటు చేసిన సహాయక శిబరం వద్ద బాధితులను పరామర్శిస్తున్న కాంగ్రెస్ నాయకులు గులామ్ నబీ ఆజాద్, అంబికా సోనీ, సైఫుద్దీన్ సోజీ.
జమ్మూ కాశ్మీర్ వరదలు లేటెస్ట్ అప్ డేట్స్
వరదల కారణంగా కొట్టుకోపోయిన శ్రీనగర్ లోని అబీ గుజార్ ఏరియా.
జమ్మూ కాశ్మీర్ వరదలు లేటెస్ట్ అప్ డేట్స్
వరదల కారణంగా సర్వసం కోల్పోయి కళ్ల వెంట్ నీళ్లు పెట్టుకున్న ఓ కాశ్మీరీ సిక్కు. జవహార్ నగర్లో నివాసం ఉంటున్న ఇతని ఇళ్లు వరదలో కూలిపోయింది.
జమ్మూ కాశ్మీర్ వరదలు లేటెస్ట్ అప్ డేట్స్
శ్రీనగర్ లోని లాల్ చౌక్ ప్రాంతంలో భారీగా చేరిన వరద నీరు.
జమ్మూ కాశ్మీర్ వరదలు లేటెస్ట్ అప్ డేట్స్
వరదల కారణంగా సురక్షిత ప్రాంతాలుకు తరలిపోతున్న శ్రీనగర్లోని వాసులు.
జమ్మూ కాశ్మీర్ వరదలు లేటెస్ట్ అప్ డేట్స్
శ్రీనగర్ లోని ఛట్టాబల్ ప్రాంతంలో వాలంటీర్లు ఆడవారని సురక్షిత ప్రాంతాలుకు తరలిస్తున్న దృశ్యం.
జమ్మూ కాశ్మీర్ వరదలు లేటెస్ట్ అప్ డేట్స్
శ్రీనగర్ లోని ఛట్టాబల్ ప్రాంతంలో వాలంటీర్లు ఆడవారని సురక్షిత ప్రాంతాలుకు తరలిస్తున్న దృశ్యం.
జమ్మూ కాశ్మీర్ వరదలు లేటెస్ట్ అప్ డేట్స్
శ్రీనగర్
లోని
ఛట్టాబల్
ప్రాంతంలో
వాలంటీర్లు
ఆడవారని
సురక్షిత
ప్రాంతాలుకు
తరలిస్తున్న
దృశ్యం.
జమ్మూ కాశ్మీర్ వరదలు లేటెస్ట్ అప్ డేట్స్
శ్రీనగర్ లోని లాల్ చౌక్ ప్రాంతంలో భారీగా చేరిన వరద నీరు. వరద నీటిలోనే నడుచుకుండూ తమ తమ ఇళ్లకు వెళుతున్న బాధితులు.
జమ్మూ కాశ్మీర్ వరదలు లేటెస్ట్ అప్ డేట్స్
వరదబాధితుల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆహారం, మందులను తీసుకోని.. తమ ఇళ్లకు వెళుతున్న బాధితులు.
జమ్మూ కాశ్మీర్ వరదలు లేటెస్ట్ అప్ డేట్స్
భారీ వరదల కారణంగా శ్రీనగర్ లోని లాల్ చౌక్ ప్రాంతంలో నిలిపోయిన వాహనాలు.
ప్రభుత్వానికి చెందిన ఉన్నాతధికారులు కూడా ఈ వరదల్లో చిక్కుకుపోయారని తెలిపారు. వరద సహాయ కేంద్రాలైన బారాముల్లా, సనత్ నగర్, రాజ్ భాగ్, జవహర్ నగర్, గోగ్జిభాగ్, ఇక్రాజ్ పుర తదితర ప్రాంతాల్లో నిలిచిపోయిన వరదనీటిని భారీ యాంత్రాలతో తోలగిస్తున్నామన్నారు.
శ్రీనగర్ - బారాముల్లా మార్గాల్లో రైళ్ల రాకపోకలను పాక్షికంగా పునరుద్దరించారు. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులను ఇప్పటి వరకు 2.4 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 80 వరకు సరుకు రవాణా విమానాలు, హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ బలగాలు 19 పునరావాస కేంద్రాలను నెలకొల్పాయి.