అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఉధృతి పెరిగిన వేళ- ఆసుపత్రిలో కర్ణాటక మాజీ సీఎం
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఏ పార్టీ అనేది ఆ రోజున తేలిపోతుంది.
ఈ నేపథ్యంలో అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్).. సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ కసరత్తు చేస్తోంది. వరుసగా సీనియర్ నాయకులు రాజీనామా చేస్తోండటం ఆ పార్టీకి మింగుడుపడట్లేదు.మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవాది సహా ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గుడ్బై చెప్పారు.
వారంతా కాంగ్రెస్, జేడీఎస్లల్లో జాయిన్ అయ్యారు. అటు జేడీఎస్ అధినాయకత్వం జిల్లాల్లో విస్తృతంగా పర్యటనలు సాగిస్తోంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి- ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోన్నారు. ఓల్డ్ మైసూరు రీజియన్లో జేడీఎస్కు చెక్కు చెదరని ఓటుబ్యాంక్ ఉంది. ఈ రీజియన్లో మెజారిటీ స్థానాలను గెలుచుకోవడంపై దృష్టి సారించింది.

ఉత్తర కర్ణాటకలోని రాయచూర్, దావణగెరె, బాగల్కోట్, బీదర్, బళ్లారి, విజయపురాలపై పట్టు సాధించడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందులో భాగంగా కుమారస్వామి పలుమార్లు ఆయా జిల్లాల్లో పర్యటించారు. మఠాధిపతులను కలుసుకున్నారు. గ్రామీణ నియోజకవర్గాలపై ప్రధానంగా ఆయన ఫోకస్ పెట్టారు. సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తూ వస్తోన్నారు.
హసన్ జిల్లాలో తన తండ్రి హెచ్డీ దేవేగౌడతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కుమారస్వామి అనారోగ్యానికి గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్నారు. దీనితో ఆయనను బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు.
జ్వరంతో బాధపడుతున్నారని, దాని తీవ్రత తగ్గిందని వివరించారు. విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని అన్నారు. జ్వరం తగ్గిన తరువాత మళ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని కుటుంబ సభ్యులు చెప్పారు. తన ఆరోగ్యం బాగుందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని కుమారస్వామి చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications