ఇన్సూరెన్స్ డబ్బు కోసం 2. 7 కేజీల బంగారు నగలు, జ్యువెలరీ షాప్ ఓనర్ స్కెచ్ !
బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు నగరంలో కోట్ల రూపాయాల వ్యాపారం చేస్తున్న వ్యాపారులు వారి షాపులు, షోరూమ్ లకు ఇన్సూరెన్స్ చేస్తుంటారు. ముఖ్యంగా జ్యువెలర్స్, ఎలక్ట్రిక్ షాపులు, షోరూమ్ లు, కోట్లలో వ్యాపారాలు చేస్తున్న బట్టల వ్యాపారులు, హోల్ సేల్ వ్యాపారులు ఇాలా అన్ని రంగాల్లో నిత్యం రూ. కోట్లలో టర్నోవర్ చేస్తున్న హోల్ సేల్ వ్యాపారులు వారి షాపులు, షోరూమ్ లు, గౌడన్ లకు ఇన్సూరెన్స్ చేస్తుంటారు.
2.7 కిలోల బంగారం చోరీ కేసులో ఫిర్యాదు చేసిన జ్యువెలరీ షాప్ యజమానినే పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. మార్కెట్ ఫ్లైఓవర్ సమీపంలో చోరీ జరిగిందని షాపు యజమాని కే
పెట్టాడు. కైలాష్ జ్యువెలరీ షోరూమ్ యజమాని రాజేష్ జైన్ అలియాస్ రాజు జైన్ అరెస్టు అయిన నిందితుడు. సిటి మార్కెట్ సమీపంలోని నగరత్ పేట్ లో రాజు జైన్ కైలాష్ జ్యువెలర్స్ అనే నగల దుకాణానికి యజమాని. పోలీసుల విచారణలో బీమా క్లెయిమ్ కోసం తాను అందరిని మోసం చేశానని రాజు జైన్ అంగీకరించాడని పోలీసులు అన్నారు.

ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం రాజు జైన్ అతనికి కావలసి వారిని ఉపయోగించుకుని దొంగతనం చేయించి డ్రామాలు ఆడాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు నగల యజమాని రాజు జైన్ ను పిలిచి విచారించారు. అప్పటికే ఈ కేసు కొలిక్కి వచ్చిందని తెలుసుకున్న నగల వ్యాపారి రాజు జైన్లో వణుకు మొదలైంది. పోలీసులు తమదైన శైలిలో రాజు జైన్ కు బెండ్ తీసి విచారణ కొనసాగించగా తానే నేరం చేశానని నగల యజమాని ఒప్పుకున్నాడని పోలీసులు అన్నారు.

బీమా క్లెయిమ్ కోసం ఈ చోరీ డ్రామా ఆడినట్లు నగల యజమాని రాజు జైన్ అంగీకరించాడు. ప్రస్తుతం కాటన్ టౌన్ పోలీసులు షాపు యజమాని రాజు జైన్ తో పాటు ఇద్దరు బాల నేరస్తులను అరెస్ట్ చేసి అరెస్ట్ చేసిన వారి నుంచి 2.7 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద ఇన్సూరెన్స్ డబ్బు కోసం బాలనేరస్తులతో కలిసి కన్నింగ్ స్కెచ్ వేసిన జ్యువెలరీ షాప్ యజమాని రాజు జైన్ అరెస్టు కావడంతో బెంగళూరులోని సాటి జ్యువెలరీ షాప్ యజమానులు షాక్ అయ్యారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications